Nandan Yadav: ఎంఎస్ ధోనీలా సిక్సులు కొట్టాలి.. ఇదే మేం నేర్చుకున్న గుణపాఠం: నేపాల్ క్రికెటర్
- ప్రపంచకప్ మ్యాచ్లో నేపాల్ జట్టు అద్భుత పోరాటం
- నాలుగు పరుగుల తేడాతో నేపాల్ పరాజయం
- ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా నేపాల్ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లో నేపాల్ జట్టు అద్భుత పోరాటం చేసింది. బలమైన ఇంగ్లండ్ జట్టును చివరి ఓవర్ వరకు ఉత్కంఠకు గురి చేసిన నేపాల్.. కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓటమి అనంతరం నేపాల్ క్రికెటర్ నందన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్లో మాట్లాడిన నందన్.. ఈ ఓటమి నుంచి తమ జట్టు ఎన్నో పాఠాలు నేర్చుకుందని చెప్పాడు.
ముఖ్యంగా చివరి ఓవర్ విషయాన్ని నందన్ యాదవ్ ప్రస్తావిస్తూ… ‘మాకు నేర్చుకున్న పాఠం ఏంటంటే.. ఇన్నింగ్స్ చివర్లో సిక్సర్లు బాదాలి. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా మ్యాచ్ ఫినిష్ చేయాలి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు.
Also Read
- Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ఈ అద్భుత పోరాటం అనంతరం నేపాల్ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. అందరిలోకెల్లా దక్షిణాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేపాల్.. మీకు ఎప్పుడు అవసరమైతే నా సేవలు అందిస్తాను. పైకి, పైకి, ఇంకా పైకి వెళ్లండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్టెయిన్ ప్రశంసలు నేపాల్ జట్టుకు గొప్ప గౌరవమని నందన్ యాదవ్ పేర్కొన్నాడు. ‘క్రికెట్ను పదేళ్ల పాటు ఏలిన ఓ లెజెండ్ ఇలా స్పందించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. కానీ ఇది మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం’ అంటూ చెప్పాడు.
Also Read: Vignan Mahotsav 2026: మనసు చెప్పిందే వినండి.. ఇంకెవ్వరి మాట అస్సలు వినొద్దు: దీక్షిత్ శెట్టి
మ్యాచ్ తర్వాత తమ భావోద్వేగాలపై నందన్ యాదవ్ స్పందిస్తో.. ‘మాకు చాలా గర్వం కూడా ఉంది. అలానే బాధ కూడా ఉంది. ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుతో పోటీ పడి విజయంకు అతి దగ్గరలో ఓడిపోవడం బాధగా ఉంది. కానీ ఇలాంటి ప్రదర్శన చేయగలిగినందుకు గర్వంగా కూడా ఉంది. కాబట్టి ఇది మాకుమంచి అనుభూతి’ అని అన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 184 పరుగులు చేసింది. జాకబ్ బేతెల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రుక్ (53) హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో విల్ జాక్స్ 18 బంతుల్లో 39 పరుగులతో దూకుడు చూపించాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ ఇద్దరూ రెండేసి వికెట్లు తీశారు. చేధనలో నేపాల్ 80/6కే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), దీపేంద్ర సింగ్ ఐరీ (44) పరుగులు చేశారు. భవిష్యత్తులో నేపాల్ క్రికెట్ నుంచి మరింత సంచలనాలు రావడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు.
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!