BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ జాబితాలో అంతర్జాతీయ అంపైర్లు అనిల్ చౌదరి, మదన్గోపాల్ జయరామన్, వీరేందర్ కుమార్ శర్మ, అనంత పద్మనాభన్, నితిన్ మేనన్, నవదీప్ సింగ్ సిద్దూ, నిఖిల్ పట్వర్ధన్, సదాశివ్ అయ్యర్, ఉల్హాస్ గంధే ఉన్నారు.
Read Also: Viral News Of Gst Bills: షాపింగ్ మాళ్లలో ఇలా చేస్తే.. జీఎస్టీ పడదా?
Also Read
- ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
మరోవైపు ‘A’ కేటగిరీలో 20 మంది, ‘B’ కేటగిరీలో 60 మంది, ‘C’ కేటగిరీలో 46 మంది, ‘D’ కేటగిరీలో 11 మంది అంపైర్లు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ గేమ్కు అంపైరింగ్ బాధ్యత వహించే ‘A+’, ‘A’ కేటగిరీల్లో ఉన్న అంపైర్లకు బీసీసీఐ రోజుకు రూ. 40వేలు. ఇక ‘B’, ‘C’ విభాగాల్లోని అంపైర్లకు రూ. 30వేల పారితోషికాన్ని బీసీసీఐ చెల్లించనుంది. ఈ మేరకు మాజీ అంతర్జాతీయ అంపైర్లు కే హరిహరన్, సుధీర్ అస్నాని, అమీష్ సాహెబాతో కూడిన సబ్ కమిటీ సిఫారసులను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే రంజీతో పాటు దేశీయ మ్యాచ్లకు విధులు కేటాయింపు కోసమే కొత్త కేటగిరీని ఏర్పాటు చేశామని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే దేశవాళీ క్రికెట్ గాడిన పడుతోందని.. వచ్చే రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ పుంజుకుంటుందని.. అందుకే పూర్తిస్థాయిలో అంపైర్ల ఎంపికను బీసీసీఐ పూర్తి చేసిందని వివరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?