Boycott Asia Cup: బాయ్కాట్ ఆసియా కప్.. పాక్తో మ్యాచ్ వద్దంటున్న ఫ్యాన్స్
- ట్రెండింగ్ లో బాయ్కాట్ ఆసియా కప్..
- పాక్ తో భారత జట్టు మ్యాచ్ ఆడొద్దంటున్న నెటిజన్స్..
- పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారితో మ్యాచ్ ఆడటం ఏంటి?..
- పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటానికి బీసీసీఐకి మనసెలా వచ్చింది: నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boycott Asia Cup: ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు రెండుసార్లు తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 14, 21వ తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఆసియా కప్ హోస్ట్ హక్కులు టీమిండియావే అయినప్పటికీ, యూఏఈ వేదికగానే మ్యాచులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు అభిమానుల కోపానికి కారణమైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో క్రికెట్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. తాజాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ భారత్ ఛాంపియన్స్-పాక్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ను రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆసియా కప్లో భారత్- పాక్ మ్యాచ్లు నిర్వహించాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
Also Read
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
ఇక, భారత్-పాక్ మ్యాచ్లను బహిష్కరించాలని సోషల్ మీడియాలో అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. “బాయ్కాట్ ఆసియా కప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, కార్గిల్ విజయ్ దివస్ రోజునే ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడం దారుణం.. సెప్టెంబర్ 14న భారత్- పాక్ మ్యాచ్ జరగడం పరోక్షంగా పీసీబీకి నిధులను సమకూర్చడమే.. అదే డబ్బును మన మీదనే దాడి చేయడానికి ఉపయోగిస్తారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి, “భారత ఆర్మీ పట్ల గౌరవం ఉంటే పాక్తో మ్యాచ్లను ఆడకూడదు.. కుదిరితే ఆసియా కప్ను బహిష్కరించండి అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఒకవైపు, ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు, పాక్తో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ రెడీ కావడం.. అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: SunPictures : సెన్సార్ బోర్డ్ పై హైకోర్టుకు సన్ పిచర్స్.. ఎన్నడా ఇది!
మరోవైపు, పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంటే.. బీసీసీఐ మాత్రం మ్యాచ్ లు ఆడటం అభిమానుల కోపానికి గురైతుంది. దాయాది దేశంతో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐకి మనసెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం, ఆటలు కలిసి సాగలేవు అని పేర్కొంటున్నారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యమా అని అడుగుతున్నారు. దేశ ప్రజల ప్రాణాల కన్నా క్రికెట్ ఇంపార్టెంట్ హా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజల మనోభావాల కన్నా కాసుల కిక్కే బీసీసీఐకి తృప్తినిస్తుందా.. డబ్బుల కోసం బీసీసీఐ ఎంతకైనా దిగజారుతుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?