Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
- తిరుమల శ్రీవారికి కళ్లు చెదిరే విరాళం
- ఏకంగా 121 కేజీల బంగారం విరాళం
- బంగారం విలువ రూ.140-150 కోట్లు
- భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anonymous Devotee Offers 121 Kg Gold to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం కోట్ల రూపాయలు విరాళంగా అందుతాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపారవేత్త శ్రీవారికి కళ్లు చెదిరే విరాళంను అందజేశారు. ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4 కార్యక్రమం లాంచింగ్ ఈవెంట్లో సీఎం మాట్లాడుతూ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం గురించి వెల్లడించారు. ఆ బంగారం విలువ రూ.140-150 కోట్లు ఉంటుంది.
‘ఓ వ్యక్తి కంపెనీ పెట్టాలనుకున్నాడు. అతడు శ్రీవారికి భక్తుడు. అనుకున్నట్లుగానే కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యాడు. అతను కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ డాలర్లు (సుమారుగా 6-7 వేల కోట్లు) వచ్చాయి. శ్రీవారి దయ వల్ల తనకు ఇంత డబ్బు వచ్చిందని, తన వంతుగా స్వామి వారికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. 121 కేజీల బంగారంను స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు. అయితే తన పేరు మాత్రం చెప్పొద్దని లెటర్ రాశాడు. 121 కేజీలే ఎందుకు అని అడిగా. తాను తెలుసుకున్నానని, శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని చెప్పాడు. ఓ భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇస్తున్నదంటే అది అతడి గొప్పతనం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తూంటారు. శ్రీవారి ఆశీస్సులతో పైకి ఎదిగామని భావించే భక్తులు తమ సంపాదనలో కొంత విరాళంగా అందిస్తారు. చాలా మంది కొన్ని కోట్లు విరాళం ఇస్తూంటారు. కొంత మంది 4-5 కేజీల ఆభరణాలు విరాళం ఇస్తుంటారు. మరికొంతమంది తమ కంపెనీల్లో తయారు చేసే బస్సులు, లారీలను ఇస్తారు. అయితే అజ్ఞాత భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ‘అంబానీకి కంటే గ్రేట్ సర్’ మీరు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఓ భక్తుడు 121కిలోల బంగారాన్ని తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తున్నారు… పేరు బయటకు చెప్పొద్దని కోరాడు.#P4Model#Margadarsi_BangaruKutumbam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/zGxFTTjPNK
— CBN Era (@CBN_Era) August 19, 2025
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!