Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
- తిరుమల శ్రీవారికి కళ్లు చెదిరే విరాళం
- ఏకంగా 121 కేజీల బంగారం విరాళం
- బంగారం విలువ రూ.140-150 కోట్లు
- భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anonymous Devotee Offers 121 Kg Gold to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం కోట్ల రూపాయలు విరాళంగా అందుతాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపారవేత్త శ్రీవారికి కళ్లు చెదిరే విరాళంను అందజేశారు. ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4 కార్యక్రమం లాంచింగ్ ఈవెంట్లో సీఎం మాట్లాడుతూ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం గురించి వెల్లడించారు. ఆ బంగారం విలువ రూ.140-150 కోట్లు ఉంటుంది.
‘ఓ వ్యక్తి కంపెనీ పెట్టాలనుకున్నాడు. అతడు శ్రీవారికి భక్తుడు. అనుకున్నట్లుగానే కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యాడు. అతను కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ డాలర్లు (సుమారుగా 6-7 వేల కోట్లు) వచ్చాయి. శ్రీవారి దయ వల్ల తనకు ఇంత డబ్బు వచ్చిందని, తన వంతుగా స్వామి వారికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. 121 కేజీల బంగారంను స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు. అయితే తన పేరు మాత్రం చెప్పొద్దని లెటర్ రాశాడు. 121 కేజీలే ఎందుకు అని అడిగా. తాను తెలుసుకున్నానని, శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని చెప్పాడు. ఓ భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇస్తున్నదంటే అది అతడి గొప్పతనం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తూంటారు. శ్రీవారి ఆశీస్సులతో పైకి ఎదిగామని భావించే భక్తులు తమ సంపాదనలో కొంత విరాళంగా అందిస్తారు. చాలా మంది కొన్ని కోట్లు విరాళం ఇస్తూంటారు. కొంత మంది 4-5 కేజీల ఆభరణాలు విరాళం ఇస్తుంటారు. మరికొంతమంది తమ కంపెనీల్లో తయారు చేసే బస్సులు, లారీలను ఇస్తారు. అయితే అజ్ఞాత భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ‘అంబానీకి కంటే గ్రేట్ సర్’ మీరు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఓ భక్తుడు 121కిలోల బంగారాన్ని తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తున్నారు… పేరు బయటకు చెప్పొద్దని కోరాడు.#P4Model#Margadarsi_BangaruKutumbam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/zGxFTTjPNK
— CBN Era (@CBN_Era) August 19, 2025
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!