Asia Cup 2025: ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్కు భారత్, శ్రీలంక దూరం!
- ఢాకాలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీకి దూరంగా భారత్, శ్రీలంక..
- బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆటగాళ్ల భద్రతపై ఆందోళన..
- ఆసియా కప్ను UAEలో నిర్వహించే ఆలోచన చేస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్లేయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, షెడ్యూల్ ప్రకారం ఏసీసీ మీటింగ్ కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇంకా రెండు వారాల గడువు ఉంది.. అన్ని సభ్య దేశాలు ఏర్పాట్లు టోర్నీ కోసం చేసుకుంటున్నాయి. ఎవరైనా ఢాకాకు రాకూడదని అనుకుంటే.. వారు వర్చువల్ గా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ఢాకాలో ఈ మీటింగ్ మాత్రం తప్పకుండా జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Himachal Floods: హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, జూలై 20 – 24 మధ్య బంగ్లాదేశ్ – పాక్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగబోతుంది. కాబట్టి, ఏసీసీ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడానికి రెడీ అయ్యారు. కాగా, ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా ఢాకాలో జరగలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.. ఈ టోర్నమెంట్ నిర్వహించే హక్కులు భారత్దే. కానీ, టోర్నీని మరో చోటుకు మార్చాలని ఏసీసీని బీసీసీఐ అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే, భారత్లోకి పాక్ జట్టుకు పర్మిషన్ ఇవ్వడం కష్టం.. అందుచేత, పాక్ ఆడే మ్యాచులను శ్రీలంక, లేదా బంగ్లాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్. మరోవైపు అసలు ఆసియా కప్ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమేనా? అని బీసీసీఐని ఏసీసీ అడిగినట్లూ పలు కథనాలు వస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి తాము వైదొలగడం లేదని ఇప్పటికే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ, పోటీలను భారత్లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!