Asia Cup 2025: ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్కు భారత్, శ్రీలంక దూరం!
- ఢాకాలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీకి దూరంగా భారత్, శ్రీలంక..
- బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆటగాళ్ల భద్రతపై ఆందోళన..
- ఆసియా కప్ను UAEలో నిర్వహించే ఆలోచన చేస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్లేయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, షెడ్యూల్ ప్రకారం ఏసీసీ మీటింగ్ కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇంకా రెండు వారాల గడువు ఉంది.. అన్ని సభ్య దేశాలు ఏర్పాట్లు టోర్నీ కోసం చేసుకుంటున్నాయి. ఎవరైనా ఢాకాకు రాకూడదని అనుకుంటే.. వారు వర్చువల్ గా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ఢాకాలో ఈ మీటింగ్ మాత్రం తప్పకుండా జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Himachal Floods: హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, జూలై 20 – 24 మధ్య బంగ్లాదేశ్ – పాక్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగబోతుంది. కాబట్టి, ఏసీసీ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడానికి రెడీ అయ్యారు. కాగా, ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా ఢాకాలో జరగలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.. ఈ టోర్నమెంట్ నిర్వహించే హక్కులు భారత్దే. కానీ, టోర్నీని మరో చోటుకు మార్చాలని ఏసీసీని బీసీసీఐ అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే, భారత్లోకి పాక్ జట్టుకు పర్మిషన్ ఇవ్వడం కష్టం.. అందుచేత, పాక్ ఆడే మ్యాచులను శ్రీలంక, లేదా బంగ్లాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్. మరోవైపు అసలు ఆసియా కప్ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమేనా? అని బీసీసీఐని ఏసీసీ అడిగినట్లూ పలు కథనాలు వస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి తాము వైదొలగడం లేదని ఇప్పటికే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ, పోటీలను భారత్లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
-
AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!