Asia Cup 2025: ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్కు భారత్, శ్రీలంక దూరం!
- ఢాకాలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీకి దూరంగా భారత్, శ్రీలంక..
- బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆటగాళ్ల భద్రతపై ఆందోళన..
- ఆసియా కప్ను UAEలో నిర్వహించే ఆలోచన చేస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్లేయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, షెడ్యూల్ ప్రకారం ఏసీసీ మీటింగ్ కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇంకా రెండు వారాల గడువు ఉంది.. అన్ని సభ్య దేశాలు ఏర్పాట్లు టోర్నీ కోసం చేసుకుంటున్నాయి. ఎవరైనా ఢాకాకు రాకూడదని అనుకుంటే.. వారు వర్చువల్ గా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ఢాకాలో ఈ మీటింగ్ మాత్రం తప్పకుండా జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Himachal Floods: హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, జూలై 20 – 24 మధ్య బంగ్లాదేశ్ – పాక్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగబోతుంది. కాబట్టి, ఏసీసీ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడానికి రెడీ అయ్యారు. కాగా, ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా ఢాకాలో జరగలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.. ఈ టోర్నమెంట్ నిర్వహించే హక్కులు భారత్దే. కానీ, టోర్నీని మరో చోటుకు మార్చాలని ఏసీసీని బీసీసీఐ అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే, భారత్లోకి పాక్ జట్టుకు పర్మిషన్ ఇవ్వడం కష్టం.. అందుచేత, పాక్ ఆడే మ్యాచులను శ్రీలంక, లేదా బంగ్లాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్. మరోవైపు అసలు ఆసియా కప్ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమేనా? అని బీసీసీఐని ఏసీసీ అడిగినట్లూ పలు కథనాలు వస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి తాము వైదొలగడం లేదని ఇప్పటికే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ, పోటీలను భారత్లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
-
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు