AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు మూడో రోజు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. మూడో రోజు సమావేశాల్లో పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని యల్లసిరి కాల్వ పనులు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం, ఏలేరు కాల్వ బెడ్ రెగ్యులేటర్లు వంటి అంశాలు నేడు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.
అలాగే ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, గృహాల మ్యాపింగ్లో సవరణకు అవకాశం, గ్రీన్ డేటా సెంటర్ విధానం వంటి అంశాలపై కూడా సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో సాంకేతిక సిబ్బంది కొరత, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్య, సాగునీరు, పట్టణాభివృద్ధి, సాంకేతిక రంగం, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
- Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
- David Warner: మూడు గ్లాసుల మందు... కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
మరోవైపు శాసనమండలి మూడో రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మండలిలోనూ పలు ప్రజా సమస్యలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, గృహాల మంజూరు, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. ఉన్నతి పథకం, గృహాల మంజూరు, ఆర్వో వాటర్ ప్లాంట్లు, స్త్రీ శక్తి పథకం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య పరిస్థితులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అంశాలపైనా మండలిలో చర్చ జరగనుంది.
అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చే చర్యలు, ఆక్వా కల్చర్ రంగంలో నెలకొన్న సంక్షోభం వంటి అంశాలు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు రానున్నాయి. మూడో రోజు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
-
Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!