ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సభ కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. సభ్యులు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవడంతో సభలో చర్చలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అలాగే ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా సమస్యపై కూడా చర్చ జరగనుంది. నాడు–నేడు పథకం (2019–24) అమలు పరిస్థితులు, నెల్లిమర్ల నియోజకవర్గంలో హైటెన్షన్ లైన్ల సమస్యలు, ఆక్వా రైతులకు…
ప్రభుత్వం అసత్యాలు మాట్లాడుతుందంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తమకు వాకౌట్ చేయటం ఫ్యాషన్ అని కొందరు మాట్లాడుతున్నారని.. అది ఫ్యాషన్ కాదని, అలా చేస్తే అయినా కూటమి ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. తాము సమాధానాలు చెప్తే వినాలని.. అవాస్తవాలు మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రశ్నకి వైసీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ… ‘రూ.8500 కోట్లు ఫీజు…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పిలిచి మాట్లాడిన ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్కు దువ్వాడ ఎదురుపడ్డారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలో జగన్ను దువ్వాడ కలిశారు. దువ్వాడను చూసిన జగన్.. స్నేహపూర్వకంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అంటూ పలకరించారు. ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ అభ్యర్థించారు. సమగ్రంగా…
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలను మార్చి 7 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు…
అమరావతిలో ఈరోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ ఆరోపణలు, నిరుద్యోగ భృతి అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి విషయాలపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం జరిగే తొలి రోజు సభలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి…