IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోపీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం..
- బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు బిగ్ షాక్స్..
- గాయాల కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్స్ గిల్, రాహుల్..
- తొలి టెస్ట్ మ్యాచ్ సమయానికి కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో స్టార్ట్ కానుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులను టీమిండియా గెలవాల్సి ఉంది. దీంతో ఈ సిరీస్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Read Also: Koti Deepotsavam 2024: కార్తీక ఆదివారం వేళ.. కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు ఇవే!
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
కాగా, ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ వేలికి గాయమైంది. అతని వేలుకు బంతి బలంగా తాకడంతో .. వెంటనే మ్యాచ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత స్కానింగ్ తీయగా గిల్ వేలికి చీలిక వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తొలి టెస్టుకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఆలోపు అతడు కోలుకునే ఛాన్స్ తక్కువగా ఉందని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
Read Also: Success Story: రూ.8 లక్షలతో స్టార్టప్.. ప్రస్తుతం రూ.23,567 కోట్ల బిజినెస్.. విజయ రహస్యం?
ఇక, కేఎల్ రాహుల్ మోచేతికి దెబ్బ తాకడంతో శుక్రవారం రాహుల్ గ్రౌండ్ ను వీడాడు. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి మరో ఐదు రోజులు సమయం ఉండటంతో అతడు మ్యాచ్ సమయానికి జట్టుకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. గిల్ గాయం మానాలంటే కనీసం వారం రోజులకు పైగా సమయం పడుతుందని సమాచారం. శుభ్ మన్ గిల్ తొలి టెస్టుకు దూరమైతే.. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!