దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ లవర్స్కి గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..!
యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. తొలి రౌండ్లో క్వాలిఫయర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి.
Also Read
- Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
12 దేశాలను రెండు గ్రూప్లుగా విభజించారు. ఇక టోర్నీ లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఎందుకంటే రెండు దాయాదీ దేశాలు గ్రూప్ 2లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్తో పాటు న్యూజిలాండ్ ఆఫ్గానిస్థాన్ గ్రూప్2లో ఉండగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడి చోటు దక్కించుకోనున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. 2021 మార్చి 20 నాటి టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూప్స్ను విభజించింది ఐసీసీ.
గ్రూప్-2లో మాజీ చాంపియన్స్ భారత్, పాకిస్థాన్తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్లు ఉన్నాయి. మరో రెండు క్వాలిఫయర్స్ టీమ్ జతకానున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు మొత్తం 8 జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్ మ్యాచ్లను కూడా రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమిబియా, శ్రీలంక గ్రూప్-ఏలో ఉండగా.. ఓమన్, స్కాట్లాండ్, పీఎన్జీ, బంగ్లాదేశ్ గ్రూప్బీలో ఉన్నాయి.
భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మరోసారి భారత్-పాక్లు టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే తలపడనున్నాయి.
- Tags
- bcci
- ind vs pak
- india
- Pakistan
- pcb
తాజావార్తలు
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!