Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Mla Raghunandan Rao Why Are You So Dull

BJP MLA Raghunandan Rao: ఎందుకిలా డల్‌గా ఉన్నారు?

Published Date :July 4, 2022 , 11:09 am
By NTV WebDesk
BJP MLA Raghunandan Rao: ఎందుకిలా డల్‌గా ఉన్నారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు.

మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో వాళ్లిద్దరికి అటూ ఇటూ కూర్చున్న అమిత్‌షా, నడ్డా, తరుణ్‌ ఛుగ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ ఆసక్తికరంగా అటు చూస్తూ నవ్వుతూ కనిపించారు. అప్పుడు రఘునందన్‌రావు మొహంలో ఏ ఫీలింగూ లేదు. సాక్షాత్తూ ప్రధాని మోడీయే బండి సంజయ్‌ని మెచ్చుకుంటూ ఉంటే ఆ తాలూకు ఎక్స్‌ప్రెషన్‌ అక్కడున్న ప్రతిఒక్కరి ఫేస్‌లోనూ ప్రతిబింబిస్తోంది. కానీ ఈ ముఖ్యమైన సన్నివేశం తన కళ్ల ముందే జరుగుతున్నా దుబ్బాక ఎమ్మెల్యే మాత్రం అన్యమనస్కంగా, అదేమీ పట్టనట్లుగా విచార వదనంతో ఉన్నారు.

read also: Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం

పరేడ్‌ మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభా వేదిక పైనా ఇవే దృశ్యాలు రిపీట్‌ అయ్యాయి. అక్కడ సైతం రఘునందన్‌రావు స్టేజీ మీద రెండో వరుసలో మధ్యలోనే ఆసీనులయ్యారు. అయితే అగ్రనేతలంతా నిల్చొని చేతులెత్తి సభికులకు అభివాదం చేస్తున్న సందర్భంలో కూడా ఆయన ముభావంగానే కళ్లు నేలకేసి చూస్తూ ఉన్నారు. మరోసారి.. ప్రధాని మోడీ అమిత్‌ షాతో మాట్లాడుతున్నప్పుడూ రఘునందన్‌రావు చేతులు కట్టుకొని అచేతనంగా అదో లోకంలో ఉన్నట్లు కనిపించారు.

ఈ మీటింగులకు సంబంధించి నిన్న టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను, ఇవాళ పేపర్లలో వార్తలను, ఫొటోలను చూసినవాళ్లు బీజేపీ ఎమ్మెల్యే ఎందుకిలా డల్‌గా ఉన్నారనేదానిపై చర్చించుకుంటున్నారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అనూహ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రఘునందన్‌రావు ఆ తర్వాత బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన బీజేపీలో కంఫర్ట్‌గా లేడనే వార్తలు వస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో బాధితురాలి ఫొటోలను రఘునందన్‌రావు బయటపెట్టడం ద్వారా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెచ్చారనే విమర్శలు వినిపించాయి. బాధితురాలి ఫొటోలను వెల్లడించకూడదనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. అయితే దీనిపై రఘునందన్‌రావు చేస్తున్న పోరాటంలో పార్టీ మద్ధతు లభించట్లేదని అంటున్నారు. ఫలితంగా ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. బండి సంజయ్‌కి, రఘునందన్‌రావుకి మధ్య పొసగట్లేదని టాక్‌.

read also: COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు

అందుకే రఘునందన్‌రావు తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతారనే ప్రచారమూ జరిగింది. ఎమ్మెల్యే అయిన కొత్తలో రఘునందన్‌రావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మీద కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు వివాదం తలెత్తింది. దీంతో ఆయన వైఎస్‌ అభిమానులకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హ్యాపీగా పాల్గొనలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandisanjay
  • bjp
  • MLA
  • modi
  • raghunandan rao

తాజావార్తలు

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions