Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. అయితే వ్యక్తిగతంగా ఆయన బిజీ షెడ్యూళ్ల కారణంగానే ప్రధాని పర్యటనకు దూరమైనట్లు జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పవన్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అద్భుతమైన కార్యక్రమం అని పవన్ ప్రశంసించారు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీకి జనసేన తరపున పవన్ కళ్యాణ్ శుభాభివందనాలు తెలిపారు. భీమవరంలో పోటీ చేసిన తనకు ఇది ప్రత్యేకమని అభివర్ణించారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ సూచించారు.
Read Also: Nara Lokesh : అల్లూరి విగ్రహావిష్కరణపై ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
మరోవైపు టీడీపీ నుంచి ప్రధాని బహిరంగ సభ కార్యక్రమానికి ప.గో. జిల్లా ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన శివరామరాజు హాజరుకానున్నారు. అయితే పీఎంవో అధికారిక షెడ్యూల్లో జనసేన నేతల పేర్లు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఆయన్ను ప్రత్యేకంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి భీమవరం చేరుకున్నారు. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం.. అందులోనూ అల్లూరి సీతారామ రాజుకు గౌరవంగా నిర్వహిస్తుండటంతో ప్రధాని సభకు హాజరవ్వాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.
అటు ప్రధాని మోదీ భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్లోనే ఉండిపోయారు. తాను భీమవరం రావడం లేదంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!