బీజేపీ కార్పొరేటర్లకు తప్పని చిక్కులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు.. కాలనీల మునక హైదరాబాద్లోని కార్పొరేటర్లకు కష్టాలు తెచ్చి పెడతున్నాయా? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ కార్పొరేటర్లకు చిక్కులు తప్పడం లేదా? బాధితులను ఓదారుస్తున్నా.. లోపల మాత్రం ఆ పార్టీకి ఎక్కడో తేడా కొడుతోందా?
అప్పట్లో గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మౌనం..!
Also Read
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ గమ్మత్తుగా మారిపోతున్నాయి. గతంలో నగరంలో ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేవి. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు హైదరాబాద్లో భారీ వర్షాలకు ఎదురైన ఇబ్బందులపై ఆ విధంగానే ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టాయి పార్టీలు. అప్పట్లో సర్కార్ను నిలదీసిన వాళ్లల్లో బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షాలకు మళ్లీ కాలనీలు నీట మునిగాయి. అప్పుడు గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్లుగా మారినా గట్టిగా అడగలేని పరిస్థితి ఉందట. మళ్లీ ఆందోళనలు చేయలేక.. రోడ్డెక్కితే ఓట్లేసిన వారి నుంచి వచ్చే రియాక్షన్ ఊహించలేక ఇబ్బంది పడుతున్నారట.
బాధితులకు ఓదార్పే తప్ప హామీలు ఇవ్వలేని పరిస్థితి!
GHMCలో బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గతంతో పోల్చితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. అప్పట్లో డివిజన్లలో ఏ సమస్యలపై పోరాడారో అవి అలాగే ఉన్నాయి. బీజేపీ నేతలు గెలిచారు కానీ.. కాలనీల సమస్యల పరిష్కారంలో వారి గళం ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం నీట మునిగి కాలనీల్లో పర్యటిస్తూ.. బాధితులను ఓదార్చుతున్నారు. అంతకుమించి హామీ ఇవ్వలేని పరిస్థితి. అలాగని.. తమతో వచ్చి ధర్నా చేయాలని కోరే ధైర్యమూ చేయడం లేదు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురమ్మంటారనే భయం?
వాస్తవానికి వరద ముప్పు నుంచి కాలనీలను బయట పడేసేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. కాకపోతే అవి టెండర్ల దశలో ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు అడుగుపడితే అధికార పార్టీ అయినా.. విపక్ష కార్పొరేటర్లకైనా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ కార్పొరేటర్లకు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒకవేళ గట్టిగా మాట్లాడితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అధికారపక్షం నుంచి కౌంటర్లు పడతాయి. అవి జనాల్లోకి వెళ్లితే.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే బీజేపీ వాళ్లకు వరద కనిపించడం లేదా అన్న కామెంట్స్ డివిజన్లలో వినిపిస్తున్నాయట. మరి.. ఈ సమస్య నుంచి కమలనాథులు ఎలా బయట పడతారో చూడాలి.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!