బీజేపీ కార్పొరేటర్లకు తప్పని చిక్కులు..!
భారీ వర్షాలు.. కాలనీల మునక హైదరాబాద్లోని కార్పొరేటర్లకు కష్టాలు తెచ్చి పెడతున్నాయా? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ కార్పొరేటర్లకు చిక్కులు తప్పడం లేదా? బాధితులను ఓదారుస్తున్నా.. లోపల మాత్రం ఆ పార్టీకి ఎక్కడో తేడా కొడుతోందా?
అప్పట్లో గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మౌనం..!
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ గమ్మత్తుగా మారిపోతున్నాయి. గతంలో నగరంలో ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేవి. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు హైదరాబాద్లో భారీ వర్షాలకు ఎదురైన ఇబ్బందులపై ఆ విధంగానే ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టాయి పార్టీలు. అప్పట్లో సర్కార్ను నిలదీసిన వాళ్లల్లో బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షాలకు మళ్లీ కాలనీలు నీట మునిగాయి. అప్పుడు గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్లుగా మారినా గట్టిగా అడగలేని పరిస్థితి ఉందట. మళ్లీ ఆందోళనలు చేయలేక.. రోడ్డెక్కితే ఓట్లేసిన వారి నుంచి వచ్చే రియాక్షన్ ఊహించలేక ఇబ్బంది పడుతున్నారట.
బాధితులకు ఓదార్పే తప్ప హామీలు ఇవ్వలేని పరిస్థితి!
GHMCలో బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గతంతో పోల్చితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. అప్పట్లో డివిజన్లలో ఏ సమస్యలపై పోరాడారో అవి అలాగే ఉన్నాయి. బీజేపీ నేతలు గెలిచారు కానీ.. కాలనీల సమస్యల పరిష్కారంలో వారి గళం ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం నీట మునిగి కాలనీల్లో పర్యటిస్తూ.. బాధితులను ఓదార్చుతున్నారు. అంతకుమించి హామీ ఇవ్వలేని పరిస్థితి. అలాగని.. తమతో వచ్చి ధర్నా చేయాలని కోరే ధైర్యమూ చేయడం లేదు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురమ్మంటారనే భయం?
వాస్తవానికి వరద ముప్పు నుంచి కాలనీలను బయట పడేసేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. కాకపోతే అవి టెండర్ల దశలో ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు అడుగుపడితే అధికార పార్టీ అయినా.. విపక్ష కార్పొరేటర్లకైనా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ కార్పొరేటర్లకు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒకవేళ గట్టిగా మాట్లాడితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అధికారపక్షం నుంచి కౌంటర్లు పడతాయి. అవి జనాల్లోకి వెళ్లితే.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే బీజేపీ వాళ్లకు వరద కనిపించడం లేదా అన్న కామెంట్స్ డివిజన్లలో వినిపిస్తున్నాయట. మరి.. ఈ సమస్య నుంచి కమలనాథులు ఎలా బయట పడతారో చూడాలి.
తాజావార్తలు
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!