ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి.?.. కమలనాధులు ఎందుకు గేర్ మార్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ స్వరం పెంచిందా.. సవరించిందా? కమలనాథులు గేర్ మార్చడానికి కారణం ఏంటి? నిరసనల పేరుతో ప్రభుత్వంపై ఘాటైన విమర్శల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లెట్స్ వాచ్!
నిరసనలతో ప్రజల అటెన్షన్ కోసం బీజేపీ యత్నం
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దూకుడు తగ్గింది. ప్రజా సమస్యలపై నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప పోరాటాలు చేయడం లేదు. కరోనా కారణమో ఏమో మునుపటి స్పీడ్ లేదు. దీనికితోడు పార్టీలోనూ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయట. అందుకే పోరాటాలలో నామమాత్రంగా ఉండిపోయామన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉందట. దీంతో ఫ్రేమ్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. నిరసనల చేపట్టే బాధ్యత తీసుకుంది. ఉన్నంతలో కాస్తో కూస్తో రోడ్డెక్కుతున్నారు బీజేపీ నాయకులు.
ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్, వీర్రాజు విమర్శలు
ఏపీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొదట నిరసనలకు దిగింది బీజేపీ. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేశారు పార్టీ నాయకులు. బీజేపీ కార్యాలయాలు.. నివాసాల్లోనే బైఠాయించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నిరసనల తర్వాత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆపై రాష్ట్రంలో నూతన ఆస్తిపన్నుపైనా పోరాటం చేసింది బీజేపీ. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు కూడా. రాష్ట్రంలో గిల్లుడు, బాదుడు అని కొత్త పథకాలు పెట్టారని విరుచుకుపడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాటాలకు బీజేపీ నిర్ణయం
ధాన్యం, ఆస్తి పన్నుల అంశాల్లో టీడీపీ నుంచి నిరసనలు లేవు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండటం.. కోవిడ్ కారణంగా పార్టీలోని ముఖ్య నాయకులు బయటకు రావడానికి ఇష్ట పడకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేసి… ప్రజల అటెన్షన్ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. సీరియస్ సమస్యలపై వెంటనే స్పందించేలా ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాటాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ భేటీలోని నిర్ణయాల ప్రకారం పాలనా అంశాలు.. ప్రజా సమస్యలపై గేర్ మార్చింది బీజేపీ.
ప్రజాపక్షం అనే ట్యాగ్లైన్ తగిలించుకున్నారా?
గతంలో ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాలంటే బీజేపీ నేతలు ఆచితూచి వ్యవహరించేవారు. ఒకవేళ ఏదైనా తిట్టిపోసినా.. ముందు చంద్రబాబును నాలుగు మాటలు అన్న తర్వాతనే సీఎం జగన్ పేరు ఎత్తేవారు. ఈ మధ్యకాలంలో నేతల తీరులోనూ తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ తర్వాత ముఖ్యమంత్రికి కేంద్ర పెద్దల అండ ఉందనే వాదన విస్తృతమైంది. ఆ ప్రచారం బీజేపీ ఎదుగుదలకు డ్యామేజీగా భావించారట పార్టీ నేతలు. అందుకే నిరసనల హోరు.. జోరు పెంచారనే వారు లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా ఎంపీ జీవీఎల్ కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేశారని అనుకుంటున్నారట. ధాన్యం విషయంలో మంత్రుల వాటాలు ఎంత అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మొత్తానికి మేం ప్రజాపక్షం అనే ట్యాగ్లైన్ తగిలించుకుని కథ నడుపుతున్నారు కమలనాథులు. మరి.. ఈ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
- Tags
- Andhra Pradesh
- ap
- bjp
- bjp situation
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!