TPCC Complaints: వివాదాల లొల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది?
ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?
తెలంగాణ కాంగ్రెస్కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఈ తీరే పార్టీకి తలనొప్పిగా మారిందట. అసలు పనిని పక్కనపెట్టి నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్పై వరసపెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి సమస్యపై AICCకి లేఖలు రాసిపడేస్తున్నారట. ఈ విషయంలో సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేదట. సమస్య వచ్చిందా వెంటనే లెటర్ హెడ్ తీసుకుని కాపీ టు సోనియా కాపీ టు రాహుల్ గాంధీ అని లేఖలు వెళ్లిపోతున్నాయట.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ఇప్పటికే హైకమాండ్కు వీహెచ్ లేఖ
ఇటీవల పీసీసీ మాజీ చీఫ్ హన్మంతరావు AICCకి లేఖ రాశారు. పార్టీ కార్యక్రమాల కోసం మంచిర్యాల వెళ్తే.. తనపై దాడి జరిగిందని.. ఆ విషయంలో పీసీసీ స్పందించిన తీరును ప్రస్తావిస్తూ హైకమాండ్కు లేఖ రాశారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని సమావేశ పర్చాలని ఆ లేఖలో కోరారు వీహెచ్. ఇక వరంగల్ ఎపిసోడ్లో.. తనకు వెస్ట్ సీటు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని జంగా రాఘవ చెప్పారు. దాంతో పీసీసీ బుజ్జగించాల్సి వచ్చింది. దీంతో వరంగల్ డీసీసీ రాజేందర్రెడ్డి అలకబూనారు. నేరుగా వెళ్లి VHతో తన సమస్య చెప్పుకొన్నారట రాజేందర్రెడ్డి. 2018 ఎన్నికల్లోనే తనకు వరంగల్ వెస్ట్ టికెట్ ఇవ్వకుండా.. ఇప్పుడు మరొకరికి ఎలా హామీ ఇస్తారని నిలదీశారట రాజేందర్రెడ్డి. అదే విషయాన్ని పీసీసీకి చెప్పడంతోపాటు AICCకి లేఖ రాశారట.
జనగామ పరిణామాలపై పొన్నాల అనుమానం
తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత.. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సైతం అదే దారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనగామలో తనకు రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పొన్నాల అనుమానిస్తున్నారట. జంగా రాఘవతోపాటు.. పీసీసీ చీఫ్కు సన్నిహితంగా ఉండే నేతను జనగామలో ప్రోత్సహిస్తున్నారనే ఆవేదనలో ఆయన ఉన్నారట. అదే విషయాన్ని AICC పెద్దలకు.. స్థానిక బీసీ నాయకులకు చెప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. జంగా రాఘవకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా.. పార్టీ ఎందుకు తాత్సారం చేస్తుందనే సందేహంలో ఉన్నారు పొన్నాల.
పీసీసీ చీఫ్ వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారట
ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నుంచి రోజుకో ఫిర్యాదు వెళ్తోంది. పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా లేఖలు ఢిల్లీకి సంధించారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు ఘాటుగానే పార్టీ హైకమాండ్కు లేఖ రాశారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల కంటే.. పీసీసీ చీఫ్ వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ లేఖలో ప్రస్తావించారట. ఇలాంటి లేఖలకు వివరణ ఇచ్చుకోవడానికే ఎక్కువ సమయం పోతోందట. వాటి గురించే కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!