ఏసీబీ ఎంట్రీతో తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులు దీన్ని బాగా వంటబట్టించుకున్నారు. ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారట. తప్పించుకునే మార్గాల అన్వేషనలో క్షణం తీరిక లేకుండా ఉన్నట్టు టాక్. వారెవరో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్ద పనోళ్లపై చర్చ!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత దశాబ్దకాలంగా అక్రమ కట్టడాలకు అడ్డదిడ్డంగా అనుమతి ఇచ్చేశారు అధికారులు. ఇప్పుడా అక్రమాలను తవ్వి తీసే పనిలో పడింది ప్రభుత్వం. దాంతో ఆ అవినీతితో సంబంధం ఉన్నవారంతా ఎప్పుడు ACB ఎంట్రీ ఇస్తుందో అని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో.. ఇక్కడి వ్యవహారాలపై సిబ్బందితోపాటు బయటవాళ్లకు కూడా ఆసక్తి ఎక్కువ. ఇప్పుడా ఆసక్తే గుంటూరులోని పెద్ద పనోళ్ల గురించి చర్చించేలా చేస్తోంది.
ఏసీబీ ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు?
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో పరిమితికి మించి ఫ్లోర్లు కట్టారు. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన వెంటనే పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఏసీబీని ఆదేశించింది ప్రభుత్వం. ఏసీబీ ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నారట అధికారులు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి నివేదికిస్తామని ఏసీబీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
లాంగ్ లీవ్లో వెళ్లిపోతున్న అధికారులు?
వాస్తవానికి అక్రమ కట్టడాలు కట్టేటప్పుడు భవన యాజమానుల దగ్గర లక్షల్లో లంచాలు మింగేసిన అధికారులు.. ఇప్పుడు ఆ భవనాలను కూల్చే పరిస్థితి లేదు. కూల్చడానికి వెళ్తే భవన యజమాని ఊరుకోడు. చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక కొందరు అధికారులు .. జీతం రాకపోయినా ఫర్వాలేదని దీర్ఘకాలిక సెలవు పెట్టేశారట. మరికొందరు డిప్యుటేషన్పై వెళ్లిపోతున్నారట. ఇప్పటికే ఓ మహిళా అధికారి జరుగుతున్న పరిణామాలకు భయపడి శాఖ మార్పించుకుని వెళ్లిపోయారట. ఆమెకు ముందు కూడా కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు సైతం ట్రాన్స్ఫర్లు పెట్టుకుని జారుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇంటినే ఆఫీస్గా మార్చిన ఓ అధికారి?
కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్న అధికారుల కాల్ డేటాను ఏసీబీ సేకరించిందట. వారికి నోటీసులు పంపినట్టు చెబుతున్నారు. అయితే తేలు కుట్టిన దొంగల్లా కామ్గా ఉండిపోతున్నారట. పైకి మాత్రం మాకేం నోటీసులు రాలేదని ఎవరికి వారు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు రహస్య దర్యాప్తు చేస్తున్నారని సమాచారం అందటంతో పాత గుంటూరుకు చెందిన ఓ అధికారి తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నారట.
మొత్తానికి ఏసీబీ వల నుంచి బయట పడేందుకు ఉన్నతాధికారులు కొందరు రాజకీయ నాయకులతోనూ లాబీయింగ్ చేస్తున్నారట. మరి.. గుంటూరులోని అవినీతి జలగలు ఏసీబీ వలకు పక్కాగా చిక్కుతాయో.. నేతల అండతో ఒడ్డున పడతాయో చూడాలి.
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!