అంబర్పేట్ టీఆర్ఎస్లో పార్టీ కమిటీల చిచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్. ఇంతకీ ఏంటా పంచాయితీ?
ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..!
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
కాలేరు వెంకటేష్. హైదరాబాద్ సిటీలో అంబర్పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్కు ఎమ్మెల్యే వస్తున్నారంటే.. కార్పొరేటర్లకు కాళ్లూ చేతులు ఆడేవి కావు. అలాంటిది సీన్ రివర్స్. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. డివిజన్లలో టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ప్రకటనే వారి మధ్య నిప్పు రాజేసిందని టాక్.
ఎమ్మెల్యే అనుచరులతో కమిటీలను నింపేశారని నేతలు గరంగరం..!
తమ పదవీ కాలం పదికాలాలపాటు పదిలంగా ఉండాలని కార్పొరేటర్లు భావించడం కామన్. ఇందుకోసం పార్టీ కమిటీలలో అనుచరులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ అనుచరులకు ఆ కమిటీలలో చోటు కల్పించాలని అనుకున్నారట. కానీ.. కమిటీల ప్రకటనకు వచ్చే సరికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. స్థానిక పార్టీ కార్పొరేటర్లను లైట్ తీసుకున్నారట. నియోజకవర్గంలోని అన్ని కమిటీలలో తన అనచరులను నింపేశారని కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పైగా.. ఆ కమిటీలపై చేసిన అర్ధరాత్రి ప్రకటనలు మరింత మంట పుట్టించాయట.
డివిజన్ల వారీగా కార్పొరేటర్లు.. మాజీలు సమావేశాలు..!
ప్రస్తుతం అంబర్పేట్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వచ్చేసిందట. రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదట. రోడ్డున పడి రచ్చ చేసుకునేలా ఉన్నాయట గొడవలు. ప్రస్తుతం కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు డివిజన్ల వారీగా అనుచరులతో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఎమ్మెల్యే ఏకపక్షంగా కమిటీలను ప్రకటించారని.. వాటిని రద్దు చేసేలా టీఆర్ఎస్ పెద్దలపై ఒత్తిడి తేవాలని తీర్మానిస్తున్నట్టు టాక్.
కాలేరుపై పార్టీ పెద్దలకు కార్పొరేటర్ల ఫిర్యాదు?
అంబర్పేట్ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉంటే.. రెండుచోట్లే టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారు. వారిద్దరూ ఏకంగా టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే.. కార్పొరేటర్లను, పార్టీ నేతలను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నలు సంధిస్తున్నారట. మరి.. ఈ గల్లీ సెగలను గులాబీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!