అన్నవరం ఆలయంలో కుమ్ములాటలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం.
ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు!
Also Read
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3 కోట్ల పాత బకాయిలు ఉన్నా.. వసూలు చేసే ధైర్యం పాలకవర్గానికి లేదు.. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు సమస్య పట్టదు. బకాయిల వసూళ్లపై కోర్టు ఆదేశాలు ఉన్నా.. దానిని అడ్డం పెట్టుకుని లక్షలు వెనకేసుకుంటున్న పెద్ద మనసులు రత్నగిరి కొండపై చాలామంది ఉన్నారట. రెండేళ్లకోసారి కొండపై దుకాణాలు పొందేందుకు టెండర్లు పిలుస్తారు. కొత్తవాళ్లు వేలంలో పాల్గొనకుండా ధరావత్తు సొమ్ము పెంచేస్తారు. లీజు సమయం ముగియడానికి 3 నెలల ముందు వేలం నిర్వహించాల్సి ఉన్నా.. కాలాతీతం చేసి దుకాణాలు మూత పడేలా చేస్తారు కానీ.. దానివల్ల ఆలయానికి వచ్చే ఆదాయం పోతున్నా ఏమీ పట్టదు. ఆలయ పాలకవర్గంలో ఛైర్మన్కు, సభ్యులకు పడదు. అలాగే పాలకవర్గంలోని కొందరితో అధికారులకు పొసగదు. ఈ కుమ్ములాటలే ఆలయ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి.
దుకాణాల అద్దె బకాయిలు వసూలు చేయకుండా చేతివాటం!
గతంలో ఎవరైతే ఆలయానికి బకాయిపడ్డారో వారి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గత ఈవో. ఆ బకాయిలు అలాగే ఉన్నాయి. కానీ.. కొత్తగా వచ్చిన అధికారులు ఆ ఫ్లెక్సీలను తీయించేశారు. ఎందుకలా చేశారో ఆ సత్యదేవుడికే తెలియాలి. కరోనా కారణంగా ఆలయ పరిధిలోని దుకాణాలను 243 రోజులపాటు మూసివేశారు. అయితే 82 రోజులు మినహాయించి.. మిగతా రోజులకు అద్దె కట్టాల్సిందేనని దేవస్థానం స్పష్టం చేసింది. దీనిపై కోర్టుకెళ్లారు వ్యాపారులు. న్యాయస్థానం కూడా 82 రోజులు మినహాయించి.. మిగతా రోజులకు అద్దె కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు సమస్య ఉండిపోయింది. కోర్టు ఆదేశాల తర్వాత చర్యలు చేపట్టకుండా వ్యాపారులు పెద్ద మొత్తంలోనే అధికారులకు సమర్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొబ్బరిముక్కల వేలం పాటలోనే రూ.కోటి ఆదాయానికి గండి!
కోర్టు ఆదేశాలు.. లేదా ఆలయ నిబంధనల ప్రకారం చర్యలు చేపడితే దుకాణాల నుంచి వచ్చే ఆమ్యామ్యాలు ఏమీ ఉండవు. అందుకే అద్దెలో కొంత వెసులుబాటు కల్పించి.. మరికొంత తమ జేబుల్లో వేసుకునేందుకు కుట్ర చేశారట అవినీతి అధికారులు. వేలానికి నోటిఫికేషన్లు ఇవ్వడం.. వాటిని రద్దు చేయడం కుమ్మక్కులో భాగమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భక్తులు సమర్పించిన కొబ్బరిముక్కల వేలం పాట మూడు పర్యాయాలు వాయిదా పడి.. దాదాపు కోటి రూపాయల ఆదాయానికి గండి పడింది. మరో 5 నెలల్లో అన్నవరం ఆలయ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో తమకు కలిసి వచ్చే అంశాలపై తప్ప.. మరే విషయాలను సభ్యులు పట్టించుకోవడం లేదట. మరి.. సత్యదేవుడి సన్నిధిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!