Off The Record : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాచరణ ఏంటి..?
- ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాచరణ ఏంటి?
- ఇంకా పెండింగ్లో ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్లు
- రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
- ముగ్గురిపై త్వరగా తేల్చెయ్యాలని స్పీకర్ ప్రయత్నమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారు? స్పీకర్ ముందున్న కార్యాచరణ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అనర్హత పిటిషన్ ల పై.. brs ఇప్పటికే సుప్రీంకోర్టు కి వెళ్ళింది. స్పీకర్ పై సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే ఏడుగురు mla ల అనర్హత పిటిషన్ ల పై నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్….ఇంకా ముగ్గురు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఐతే…రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని… సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే…ముగ్గురు MLA ల పిటిషన్ లపై ఇంకా నిర్ణయం పెండింగ్ లో ఉంది. వీటిపై వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి..దానం నాగేందర్ లు ఇప్పటికే స్పీకర్ కి ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. అయితే…విచారణ జరపాల్సి ఉంది. ఇద్దరి పిటిషన్లపై త్వరలోనే నోటీసు ఇచ్చి విచారణ కి పిలిచే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్…ఇటు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణ తేదీని నిర్ణయించబోతున్నారు. విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా దానం నాగేందర్, కడియం శ్రీహరిల పిటిషన్లపై ఆధారాలను బలంగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
Also Read
కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఇది దానంకు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేందుకు కొంత అవకాశం తక్కువ. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ఓటేయాలని ప్రచారం చేశారు. కాబట్టి దీనిపై ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ అందిస్తుంది అనేది చూడాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒకేసారి నిర్ణయం ప్రకటిస్తారా .? లేదంటే సంజయ్ ది ముందే ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు కూడా రెండు వారాల గడువులోనే తేల్చాలని స్పష్టం చెయ్యడంతో పెండింగ్లో ఉన్న పిటిషన్ల విచారణలను మొదలుపెట్టే అవకాశం కనబడుతోంది.
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!