Off The Record : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాచరణ ఏంటి..?
- ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాచరణ ఏంటి?
- ఇంకా పెండింగ్లో ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్లు
- రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
- ముగ్గురిపై త్వరగా తేల్చెయ్యాలని స్పీకర్ ప్రయత్నమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారు? స్పీకర్ ముందున్న కార్యాచరణ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అనర్హత పిటిషన్ ల పై.. brs ఇప్పటికే సుప్రీంకోర్టు కి వెళ్ళింది. స్పీకర్ పై సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే ఏడుగురు mla ల అనర్హత పిటిషన్ ల పై నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్….ఇంకా ముగ్గురు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఐతే…రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని… సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే…ముగ్గురు MLA ల పిటిషన్ లపై ఇంకా నిర్ణయం పెండింగ్ లో ఉంది. వీటిపై వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి..దానం నాగేందర్ లు ఇప్పటికే స్పీకర్ కి ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. అయితే…విచారణ జరపాల్సి ఉంది. ఇద్దరి పిటిషన్లపై త్వరలోనే నోటీసు ఇచ్చి విచారణ కి పిలిచే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్…ఇటు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణ తేదీని నిర్ణయించబోతున్నారు. విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా దానం నాగేందర్, కడియం శ్రీహరిల పిటిషన్లపై ఆధారాలను బలంగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
Also Read
కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఇది దానంకు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేందుకు కొంత అవకాశం తక్కువ. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు ఓటేయాలని ప్రచారం చేశారు. కాబట్టి దీనిపై ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ అందిస్తుంది అనేది చూడాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒకేసారి నిర్ణయం ప్రకటిస్తారా .? లేదంటే సంజయ్ ది ముందే ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు కూడా రెండు వారాల గడువులోనే తేల్చాలని స్పష్టం చెయ్యడంతో పెండింగ్లో ఉన్న పిటిషన్ల విచారణలను మొదలుపెట్టే అవకాశం కనబడుతోంది.
తాజావార్తలు
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!