Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- కారు గేరు మార్చాల్సిందేనని సారు డిసైడయ్యారా?
- ఎర్రవల్లి నివాసం వేదికగా ప్రక్షాళనకు సిద్దమయ్యారా?
- ఎర్రవల్లి హైలెవల్ మీటింగ్లో కీలక నిర్ణయాలు వుంటాయా?
- సంస్థాగత నిర్ణయాలను నేతలకు స్పష్టం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో BRS పార్టీ యాక్టివిటీ మరింత పెంచనుందా? కారుకు రిపేరు చేసి గేరు మార్చాలని డిసైడయ్యిందా? ఎర్రవల్లిలో జరిగే సమావేశంలో గులాబీ బాస్ మరమ్మత్తులు చేసి పొలిటికల్ రేస్కు కారును సిద్దం చేస్తారా? తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఒకవైపు బెంగాల్ ఫార్ములాతో బీజేపీ దూకుడు పెంచుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సైలెంట్గా ఉన్న కారు.. ఇప్పుడు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. బీజేపీ దూకుడుతో పార్టీలో కొత్త టెన్షన్ మొదలు కాకముందే నేరుగా అధినేతనే రంగంలోకి దిగారు. ఈనెల 12న మంగళవారం ఎర్రవెల్లి నివాసం వేదికగా హై లెవల్ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు హాజరుకాబోతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విజువల్స్
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
ఎర్రవెల్లి సమావేశం సాధారణ సమావేశం కాదంటున్నాయి పార్టీ శ్రేణులు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై కీలక దృష్టి పెట్టారని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను నేతలకు వివరించబోతున్నారట కేసీఆర్. సభ్యత్వ నమోదు నుంచి ఇన్ఛార్జుల నియామకం దాకా అన్నింటినీ ప్రక్షాళన చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదును తక్షణమే ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారిగా ఇన్చార్జీలను సైతం ప్రకటించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన నేతలను సభ్యత్వ నమోదు కోసం ఇన్చార్జిలుగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ఇన్చార్జిలను నియమించబోతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్… గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడాలంటే పార్టీ కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అందుకోసం పార్టీ నేతలకు ఉత్సాహం కలిగేలా పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు తో పాటు కమిటీల ఏర్పాటు కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఎర్రవల్లి సమావేశంలో ఇంకెలాంటి సంకేతాలు ఇస్తారోనని అందరూ వెయిట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?