Off The Record: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే సెగ పెడుతున్నారా..? అధిష్టానికిస్తున్న లీకులేంటి?
- యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్..
- రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న నేత పొగబెడుతున్నారా?..
- యర్రగొండపాలెం నుంచి కొండేపికి ఆదిమూలపు సురేష్ ట్రాన్స్ఫర్..
- ఓటమి తర్వాత తిరిగి యర్రగొండపాలెం వైపు మాజీ మంత్రి చూపు..
- ఇప్పటికీ ఓ టీమ్తో టచ్లో ఆదిమూలపు..
- గతంలో సురేష్ సన్నిహితులు కొందరు టీడీపీలోకి..
- ఆదిమూలపు సురేష్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: 2024 ఎన్నికలలో కూటమి సునామీని తట్టుకుని నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చంద్రశేఖర్… ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా యర్రగొండపాలెం ఎమ్మెల్యేకి పొగబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ఉండే వత్తిడి సహజమే… ఊహించిందే అయినా…. సొంత వైసీపీ నాయకులు తీస్తున్న గోతులు అర్ధంకావడంలేదని వాపోతోందట ఎమ్మెల్యే వర్గం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకుని గెలిచారు చంద్రశేఖర్. అదే సమయంలో అప్పటిదాకా యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ని కొండేపికి ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. అక్కడ పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత అక్కడ నుంచే రాజకీయాలు చేస్తున్నా… ఆదిమూలపు చూపు మాత్రం యర్రగొండపాలెం వైపే ఉందని అంటున్నారట ఆయన సన్నిహితులు.
ఇప్పటికీ ఆయన నియోజకవర్గ వైసీపీలోని ఓ టీంతో టచ్లో ఉన్నారన్నది పార్టీ టాక్. స్థానిక పార్టీ నేతలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతూ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారట. గతంలో ఆదిమూలపు సురేష్ తో సన్నిహితంగా ఉన్న కొందరు ఇటీవల టీడీపీలోకి వెళ్లారు. అందులో కూడా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీకి వెళ్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకు ఆయన రియాక్ట్ కానప్పటికీ.. గతంలో కొందరు.. తాజాగా మరికొందరు యర్రగొండపాలెం వైసీపీ నేతలు టీడీపీకి వెళ్లటం యాదృచ్చికం కాదనేది ఓ విశ్లేషణ. సురేష్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం జరగక పోయినా.. ఏదో జరగబోతోందన్నది మాత్రం ఇన్సైడ్ టాక్. ఈ గందరగోళంలోనే…. సురేష్ తిరిగి యర్రగొండపాలెం రీబ్యాక్ అయ్యేందుకు పావులు కదుపుతన్నారన్న అనుమానాలు ఉన్నాయట. ఇక్కడ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఉండటంతో ఆ పార్టీ నాయకుడిగా తిరిగి రావడం అంత తేలిక కాదని, ఒకవేళ ఆదిమూలపు తిరిగి రావడమంటూ జరిగితే ఏ రూపంలో అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరే టీడీపీలోకి వెళ్తున్నారన్న మరో ప్రచారం మొదలైంది.
Also Read
దాని ప్రభావంతోనే… ఇటీవల అసెంబ్లీకి వెళ్లినప్పుడు వైసీపీ కండువా లేకుండా వచ్చారని, కండువా మర్చిపోయావా.. లేక మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ క్లాస్ పీకారంటూ ప్రచారం జరిగింది. కానీ… అదంతా తప్పుడు ప్రచారం అని ఖండించారు చంద్రశేఖర్. అయితే… గత ఎన్నికల్లో అప్పటి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోనే తాటిపర్తికి సీటు వచ్చిందని, ఇప్పుడు బాలినేని జనసేనకు వెళ్లటంతో చంద్రశేఖర్ కూడా వెళ్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది నియోజకవర్గంలో. ఇలా… ఇంటా బయటా… వత్తిళ్ళతో జోడు మద్దెల దరువులా మారిందట యర్రగొండపాలెం ఎమ్మెల్యే పరిస్థితి. ఓవైపు సోషల్ మీడియాలో విమర్శలకు ప్రభుత్వం నుంచి నోటీసులు, మరోవైపు వెళ్ళిపోతాడంటూ సొంత పార్టీవాళ్లే చేస్తున్న ప్రచారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఆయన. మొత్తం మీద యర్రగొండపాలెం పిక్చర్ క్లియర్ అవ్వాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?