Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Tdp Vs Janasena In Godavari Districts

Off The Record: జనసేన ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు పక్కనపెట్టేశారా..?

Published Date :July 31, 2025 , 10:32 am
By Sudhakar Ravula
  • జనసేనకు బలమైన జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి..
  • ఆరుగురు ఎమ్మెల్యేలున్నా ప్రాధాన్యం దక్కడంలేదన్న బాధ..
  • చిచ్చు రేపిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం..
  • ఇంటింటికి టీడీపీ, మమ్మల్ని కలుపుకోవడంలేదంటున్న జనసేన..
  • మేం కూడా అధికార భాగస్వాములమే కదా అంటున్న గ్లాస్‌ పార్టీ..
  • జనసేన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జ్‌ల దూకుడు..
  • పక్కకు నెట్టేసినట్టు ఫీలవుతున్న గ్లాస్‌ ఎమ్మెల్యేలు..
  • టీడీపీ వైఖరితో జనసేన ఎమ్మెల్యేలు చిన్నబుచ్చుకుంటున్నారా?
Off The Record: జనసేన ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు పక్కనపెట్టేశారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: 2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే… ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్‌ పార్టీ. అయినా సరే…. తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్‌ లీడర్స్‌. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా… మిగతా నియోజకవర్గాల నేతలంతా… స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా టిడిపి నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లాలో రెండు పార్టీల మధ్య అంతరాన్ని బాగా పెంచినట్టు చెప్పుకుంటున్నారు. ఆ పేరుతో… తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్తూ…. తమ ప్రాధాన్యతను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. తాము మాత్రం అలా… చూస్తూ ఉండిపోవాల్సి వస్తోందని తెగ మధనపడిపోతున్నారట గ్లాస్‌ పార్టీ లీడర్స్‌. మేం కూడా… ప్రభుత్వంలో భాగస్వాములమే అయినప్పటికీ తొలి అడుగు విషయంలో మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తోందన్నది వాళ్ళ బాధగా చెప్పుకుంటున్నారు.

Read Also: APPSC: ఏపీపీఎస్సీలో కీలక సంస్కరణలు.. ఇక, వేగంగా నియామకాలు..
అలా ఎందుకంటే… జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా… టీడీపీ ఇన్ఛార్జ్‌లే అంతా తామై కార్యక్రమం నిర్వహిస్తున్నారట. కనీసం లోకల్‌ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా కలుపుకుని ప్రోగ్రాం నిర్వహిస్తే… అందరికీ బెటర్‌ కదా అన్నది వాళ్ళ వాదన. మేం జనంలో తిరుగుతున్నా… ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ ఫీల్‌ వేరుగా ఉంటుందని, టీడీపీ నాయకులు అలాంటి సంతృప్తి తమకు దక్కనివ్వడం లేదన్నది జనసేన ఎమ్మెల్యేల బాధ. అసలు ఒక రకంగా తమను పక్కకి నెట్టేసినట్టయిందని ఫీలవుతున్నారట గ్లాస్ ఎమ్మెల్యేస్‌. గత ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయిన టీడీపీ నేతలందరికీ ఇపుడు తొలి అడుగు వరంలా మారినట్టు ఫీలవుతున్నారట. తాము అధికారంలో ఉన్నాసరే…. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో ఏడాదిగా ఎలాంటి గుర్తింపు దక్కకుండా పోయిందని, అందుకే…. ఇప్పుడు తొలిఅడుగుతో ఆ డ్యామేజిని కవర్‌ చేసుకోవాలని భావిస్తున్నారట టీడీపీ నేతలు. అలాంటి వాళ్ళంతా ఒక్కసారిగా దూకుడు పెంచడాన్ని గ్లాస్‌ శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. పైగా ఇంటింటికి వెళ్ళి.. సమస్య ఏదైనా సరే…మాకు చెప్పేయండి చాలని టిడిపి నేతలు అంటున్నారని, ఆ మాత్రందానికి ఎమ్మెల్యేలుగా మేం ఎందుకున్నట్టు అంటూ చిన్నబుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read

  • Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
  • Off The Record : తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్
  • Off The Record : కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు..అసలు కారణాలేంటి ?

Read Also: Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు

పేరుకు కూటమిలో భాగస్వాములైనా… తొలి అడుగు కార్యక్రమం మొదలయ్యాక ఇరు పార్టీల నాయకులు ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా ఉంటున్నారట. ముఖ్యంగా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల పాత్రను తగ్గించి…. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ సీట్లు తాము సాధించుకునేందుకు తెలుగుదేశం నేతలు తొలి అడుగు ప్రోగ్రామ్‌ని గట్టిగానే వాడుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. జనసేన నేతలకు కూడా ఇదే డౌట్‌ వచ్చి వాళ్ళలో వాళ్ళు తీవ్ర అంతర్మథనంలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కూడా బలమైన ఏరియా. ప్రస్తుతం ఆరు చోట్ల జనసేన శాసనసభ్యులుంటే.. మిగతా తొమ్మిది సీట్లలో టిడిపి విజయం సాధించింది. అయితే…కూటమి ఊపులో జనసేన ఆరు సీట్లు కొట్టగలిగినా… ఇప్పుడు మాత్రం ఎందుకో… ఆ స్థాయి ప్రభావం చూపలేక వెనుకబడుతోందని ఆపార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదే అదనుగా…. అసలు గ్లాస్‌ పార్టీ గెలిచింది మా బలంతోనే అంటూ…. టీడీపీ లీడర్స్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నా నేతలు చెప్పకనే చెబుతున్నారట. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరిలో రెండు పార్టీల నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ ఓ రేంజ్‌లో నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.

Read Also: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ

ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుదో అనే అనుమానాలు ఆల్రెడీ కేడర్‌లో మొదలయ్యాయి. అంతా కలిసి ఉండండి, కలిసే పని చేయండని అధిష్టానాలు గట్టిగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాతావరణం వేరుగా ఉందని, పశ్చిమలో పరిస్థితి చూస్తే.. వాస్తవం ఏంటో బోధపడుతుందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. తాము గెలిచిన చోట్ల పవర్ షేరింగ్ ఉంటోంది తప్ప.. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నది గ్లాస్‌ వాయిస్‌. పై స్థాయిలో అధినేతలు ఆశిస్తున్నదొకటి.. క్షేత్రస్థాయిలో నేతలు పాటిస్తున్నదొకటి అన్నట్టుగా ఉంటోందట వ్యవహారం. కనీసం మరో పదేళ్ళు దోస్తీ అని పెద్దోళ్ళు చెబుతున్నా… నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తుంటే మాత్రం లేనిపోని అనుమానాలు పెరుగుతున్నాయంటూ గుసగుసలాడుకుంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • Godavari districts
  • Janasena MLAs
  • off the record

తాజావార్తలు

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..

  • Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions