Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు
- భారత్కు చెందిన చమురు కంపెనీలై అమెరికా ఆంక్షలు..
- ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలపై చర్యలు..
- భారత్కు చెందిన 6 కంపెనీలు ఉన్నట్లు వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Oil Companies: భారత్పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారు అనే అభియోగాలపై ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై వైట్ హౌస్ చర్యలు తీసుకుంది. ఇందులో భారత్కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మిడిల్ ఈస్ట్ లో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ఆజ్యం పోస్తుంది. సొంత దేశ ప్రజలతో పాటు, ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా సపోర్టు ఇస్తుంది. అందుకే టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు విధిస్తుంది. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అగ్రరాజ్యం ప్రకటన విడుదల చేసింది.
Read Also: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అయితే, భారత్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీల పైనా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు తమ ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతేగాక, అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని అమెరికా హెచ్చరించింది.
Read Also: OG : ఓజీ మొదటి పాటకు కౌంట్డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?
ఆంక్షలు విధించిన భారత కంపెనీలు ఇవే..
* కాంచన్ పాలిమర్స్: 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులను UAE మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపలు చేసింది.
* ఆల్కెమికల్ సొల్యూషన్స్: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను పెట్రోకెమికల్ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకునట్లు అమెరికా పేర్కొంది.
* రమణిక్లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 22 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులను బైయింగ్, ఇంపోర్ట్ చేసుకున్నట్లు యూఎస్ తెలిపింది.
* జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను ఇంపోర్టు చేసినట్లు అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది.
* గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్: గతేడాది కాలంలో 51 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్ను టెహ్రాన్ నుంచి కొన్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది.
* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్ను కొనుగోలు చేసినట్లు యూఎస్ ఆరోపణలు చేసింది. అయితే, ఈ కంపెనీలు అన్నీ ఉద్దేశపూర్వకంగానే టెహ్రాన్ తో వాణిజ్యంలో భాగస్వాములు అయ్యాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఆంక్షలు విధింపుతో ఇప్పుడు ఆయా కంపెనీలు, వ్యక్తులకు యూఎస్ లో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!