Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Mynampally Hanumantha Rao Vs Marri Rajasekhar Reddy

Off The Record: మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ల పర్వం..

Published Date :July 16, 2025 , 9:31 pm
By Sudhakar Ravula
  • మైనంపల్లి, మర్రి రాజశేఖర్‌రెడ్డి మధ్య సవాళ్ళ పర్వం..
  • చిన్న గొడవతో మొదలై మల్కాజ్‌గిరిలో సెగలు పొగలు..
  • దమ్ముంటే మల్కాజ్‌గిరి రమ్మని మైనంపల్లికి బీఆర్‌ఎస్‌ సవాల్‌..
  • మల్కాజ్‌గిరి చౌరాస్తాలో మైనంపల్లి హన్మంతరావు, ఉద్రిక్తత..
  • ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ దగ్గర మొదలైన వివాదం..
  • బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్‌ సీట్లలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూర్చున్నారని గొడవ..
  • గాల్లోకి కాల్పులకు సిద్ధమైన ఎమ్మెల్యే మర్రి గన్‌మెన్‌..
  • ఎట్నుంచి ఎటు పోతుందోనని మల్కాజ్‌గిరిలో టెన్షన్‌..
Off The Record: మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ల పర్వం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ… చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది. ఆ దెబ్బకు మల్కాజిగిరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి సెగలు పుడుతున్నాయి. తాజాగా… అల్వాల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చెలరేగిన ఘర్షణల ప్రభావం మల్కాజిగిరి వరకు పాకడంతో ఇరు పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీట్‌ పెంచారు. దాని తాలూకు ఉద్రిక్తతలు నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉన్నాయి. పైనుంచి కింది స్థాయిదాకా.. ఈ సవాళ్ళ పర్వం నడుస్తూనే ఉంది. దమ్ముంటే మల్కాజిగిరికి రా… అంటూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు. స్వీకరించిన కాంగ్రెస్ లీడర్స్‌ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు అల్వాల్‌లో జరిగిన ఘటనే దీనికి మూల కారణం అంటున్నారు పరిశీలకులు.

Read Also: Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..

మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అక్కడ కుర్చీలు ఏర్పాటు చేసే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సరైన స్థానం ఇవ్వలేదని, ఆ సీట్లలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చున్నారంటూ వాగ్వివాదం మొదలై తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీదికి కూడా వాటర్ బాటిల్ విసిరినట్టు చెబుతున్నారు. అప్రమత్తమైన గన్ మెన్ వెంటనే దానిని అడ్డుకున్నాన్నారని, ఒక దశలో గాల్లోకి కాల్పులకు కూడా సిద్ధమయ్యారని సమాచారం. అయితే… వేగంగా స్పందించిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికి సద్దుమణిగినా… తిరిగి రాత్రి సమయంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం బీఆర్ఎస్ నేతలు చేసిన ఛాలెంజ్ కు రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి తన అనుచరులతో మల్కాజిగిరి చౌరస్తాకు వచ్చి సవాల్ విసిరారు. దీంతో పొలిటికల్‌ హీట్‌ ఒక్కసారిగా పెరిగిపోయి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అతి కష్టం మీద పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగినా… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న ఆందోళన మాత్రం అలాగే ఉందట నియోజకవర్గంలో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • hyderabad
  • Marri Rajasekhar Reddy
  • mynampally hanumantha rao

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions