T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచ కప్లో భాగంగా బుధవారం లీడ్స్ మైదానంలో జరగబోయే గ్రూప్-ఎ రెండో మ్యాచ్లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయం సాధించి టీమిండియా మంచి ఊపులో ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రాబోయే మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నందున, నెదర్లాండ్స్తో జరిగే ఈ మ్యాచ్ను భారత్ తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తోంది.
బ్యాటింగ్, ఫీల్డింగ్లో మెరుగుపడాలి..
తొలి మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన (68 పరుగులు), చివర్లో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ మంచి స్కోరు సాధించగలిగింది. అయితే మిగిలిన బ్యాటింగ్ లైన్-అప్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ త్వరగానే అవుట్ కాగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చలేకపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ భారతి ఫుల్మాలి కూడా తీవ్రంగా నిరాశపరిచింది. బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడం జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
మరోవైపు, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఫీల్డింగ్ కూడా అంతగా బాగాలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత్ కొన్ని కీలకమైన క్యాచ్లను వదిలేసింది. ఆ తర్వాత వేగవంతమైన క్యాచ్లతో పుంజుకున్నప్పటికీ, పెద్ద మ్యాచ్లలో ఇలాంటి తప్పులు భారీ నష్టాన్ని మిగులుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్పిన్నర్ల జోరు.. పేసర్ల నలత..
భారత బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ, శ్రీ చరణిలు కలిసి ఏకంగా 8 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా దీప్తి శర్మ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు (5/10) తీసి సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళల టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆమె చరిత్ర పుటల్లోకెక్కింది. శ్రీ చరణి కూడా 3 వికెట్లతో రాణించింది. అయితే, పేస్ బౌలర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ ప్రభావం చూపలేకపోయారు. నెదర్లాండ్స్పై వీరు ప్రారంభంలోనే వికెట్లు తీసి ఫామ్లోకి రావాలని జట్టు ఆశిస్తోంది.
పుంజుకోవాలని చూస్తున్న నెదర్లాండ్స్..
నెదర్లాండ్స్ జట్టు తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగుతోంది. తమ ఓటమిపై నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడే మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాలలోనూ తాము ఆశించిన ప్రదర్శన చేయలేకపోయామని అంగీకరించారు. తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోవడం, ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం తమకు నష్టం చేసిందని, భారత్తో మ్యాచ్ ద్వారా లోపాలను సరిదిద్దుకుని సరికొత్తగా రాణిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలుపు గుర్రంగా బరిలోకి దిగుతోంది. అయితే కేవలం విజయం మాత్రమే కాకుండా, రాబోయే పెద్ద సవాళ్లను తట్టుకోవడానికి జట్టుగా ఒక లయను అందుకోవడం భారత్కు అత్యంత అవసరం.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!