Off The Record: కాంగ్రెస్లో వర్గపోరు.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని టచ్ చేసినా.. మరొక నాయకుడు పేరు చెప్పి కస్సుమంటారు.
Read Also: Off The Record: ‘జాకీ’ వివాదంలో ఎమ్మెల్యే.. రాప్తాడులో రాజకీయ సెగలు
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
కరీంనగర్లో పొన్నం వర్గం నుంచి MSR వారసుడు రోహిత్రావు టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సీటును శ్రీధర్బాబు వర్గం నుంచి నరేందర్రెడ్డి కర్చీఫ్ వేశారు. ఇద్దరు నేతల మధ్య కరీంనగర్ కాంగ్రెస్ కుతకుత లాడుతోంది. రెండు వర్గాలు రెండు శిబిరాలు అన్నట్టుగా మారిపోయింది పార్టీ తీరు. రాజకీయ పోరాటాల కంటే.. తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచే అంశాలనే నేతలు టేకప్ చేస్తున్నారు. దీంతో కేడర్ కూడా విసిగిపోయి.. చెల్లాచెదురవుతోంది. రేవంత్ అనుచరుడిగా ముద్రపడిన డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ సైతం మరో గ్రూపును తయారు చేసుకున్నారట.
ఈ మూడు గ్రూపులు ఎవరికి వారుగా నియోజకవర్గాల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. స్థానికంగా పార్టీలో నెలకొన్న సమస్యలు తెలిసినా.. వారి వెనుక ఉన్న పెద్దలను గుర్తు చేసుకుని పీసీసీ జోక్యం చేసుకునే సాహసం చేయడం లేదు. దాంతో విభేదాలు పెరుగుతున్నాయే తప్ప సమసే వాతావరణం కనిపించడం లేదు. ఒకప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించేది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పార్టీ పట్టుకోల్పోతోంది. ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా రాజకీయాలు చేస్తుంటే.. వాటి మధ్యలో కాంగ్రెస్ పోరాటాలు తేలిపోతున్నాయని కేడర్ వాపోతుంది. సమస్యను ఇదే విధంగా నాన్చితే పార్టీకి.. కాంగ్రెస్ నేతలకు అసలుకే ఎసరు రావొచ్చనే ఆందోళన ఉన్నా.. ఎవరికి వారు సైలెంట్గానే ఉండిపోతున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఇప్పటి నుంచే ఫీల్డ్లో ఉండాలనేది శ్రేణుల వాదన. కానీ.. నేతలు మాత్రం ఎవరికి వారు యమునా తీరేలా అడుగులు వేస్తున్నారు. మరి.. ఈ సమస్యకు కాంగ్రెస్ అధిష్ఠానం చికిత్స చేస్తుందా లేదో చూడాలి.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!