Off The Record: వైసీపీలో హాట్ హాట్గా కడప అసెంబ్లీ టికెట్.. టికెట్కు ఫుల్ డిమాండ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కడప.. సీఎం సొంత జిల్లా.. YSR కుటుంబానికి కంచుకోట. పులివెందుల తర్వాత వైఎస్ ప్యామిలీ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కేవలం కడప ఎమ్మెల్యే అని అనిపించుకోవడమే కాదు.. అమాత్య పదవులు చేపట్టి ఓ రేంజ్కి వెళ్లిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన నాయకులు కనిపిస్తారు. 1955, 1967 ప్రాంతాల్లో ఎం.రహంతుల్లా గెలిస్తే.. తర్వాత రెడ్డి సామాజికవర్గ నాయకులు 1972 నుంచి 1989 ఎన్నికల వరకు గెలుస్తూ వచ్చారు. ఆపై కడప ట్రెండ్ మారింది. 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి SA ఖలీల్ బాష గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు YS ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థులదే గెలుపు. 2004, 2009లో ఎస్.అహ్మదుల్లా కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మారిన రాజకీయ పరిస్థితులతో అహ్మదుల్లా రాజకీయాలకు దూరం కావడంతో వైసీపీ నుంచి SB అంజాద్ బాషా కడపలో పాగా వేశారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి కూడా. గత రెండు ఎన్నికల్లో అంజాద్ బాషానే గెలుస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అంజాద్ బాషా.
Read Also: Off The Record: రేవంత్ పాదయాత్రలో నర్సంపేట మిస్..! ఆ ఒక్క ఫోన్ కాలే కారణమా..?
Also Read
కడప అసెంబ్లీ సెగ్మెంట్లో మైనారిటీ ఓటర్ల తర్వాత బలిజలు, రెడ్డి సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువ. కాకపోతే కడప సెగ్మెంట్ మైనారిటీలకు అడ్డాగా మారిపోయింది. ఈ దఫా అధికారపార్టీలో కడప సీటు కోసం గట్టి పోటీయే కనిపించే వీలుంది. వచ్చే ఎన్నికల్లో మైనారిటీ యేతరులకు టికెట్ ఇస్తారని ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. అది వర్కవుటయ్యే పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన చాలా మంది నాయకులు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక్కడ వైసీపీ సీటును మాజీ మంత్రి డాక్టర్ ఖలీల్ బాష కుమారుడు సోహెల్ కూడా ఆశిస్తున్నారట. ఖలీల్ కుటుంబానికి కడపలో రాజకీయ ప్రాధాన్యం ఉంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి టీకే అలీ అఫ్జల్ఖాన్ కూడా కర్చీఫ్ వేస్తున్నట్టు సమాచారం. 2004లోనే ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉండటంతో తనకు తప్పకుండా సీటు వస్తుందని ఆశిస్తున్నారు. అయితే కడపలో మొదటి నుంచి టికెట్ ఎంపికలో వ్యక్తుల ప్రాధాన్యం కంటే.. వైసీపీ హైకమాండ్దే తుది నిర్ణయం. దీంతో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుంది? అసలు మార్పు ఉంటుందా? ఉంటే ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనే ఉత్కంఠ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!