Asia Cup 2025: పాకిస్థాన్పై విజయం పక్కా.. భారత్ అదృష్టం దుబాయ్ చేరుకుంది!
- అఫ్గానిస్థాన్కు చెందిన వజ్మా అయుబి భారత్ ఫ్యాన్
- టీమిండియాతో ప్రత్యేక అనుబంధం
- ఆఫ్ఘనిస్తాన్ టు దుబాయ్కు వజ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025ఓ భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అభిమానులు పెద్దగా స్టేడియంకు రాకపోయినా.. ఒకరు మాత్రం మైదానంలో సందడి చేశారు. భారత జెండా పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. దాంతో క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అఫ్గానిస్థాన్కు చెందిన వజ్మా ఆయుబి. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.
2022 ఆసియా కప్ సందర్భంగా స్టేడియంలో వజ్మా ఆయుబి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే ఆమె క్రికెట్ అభిమానులకు పరిచయం అయ్యారు. క్రికెట్ పట్ల ఆమెకున్న మక్కువ, కెమెరా ముందు ఆమెకున్న ఆత్మవిశ్వాసం అభిమానులను కట్టిపెడేసింది. అప్పటి నుంచి ఆమె అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యంత ముఖ్యమైన అభిమానిగా మారారు. వజ్మా అఫ్గానిస్థాన్ జట్టుకు అభిమాని అయినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు అంటే కూడా బాగా ఇష్టం. టీమిండియా పట్ల తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఆసియా కప్ 2023లో భారత్, బంగ్లాదేశ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ జెర్సీని వజ్మా ధరించారు. ఈ జెర్సీపై విరాట్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది. కోహ్లీకి తాను పెద్ద అభిమాని అని, కింగ్ మ్యాచ్ చూడటానికి ఎక్కడికైనా వెళ్తానని తెలిపారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Also Read: Asia Cup 2025: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్!
సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాజ్మా ఆయుబి అఫ్గానిస్థాన్లో జన్మించారు కానీ.. బాల్యాన్ని మాత్రం అమెరికాలో గడిపారు. ప్రస్తుతం ఆమె దుబాయ్లో నివసిస్తున్నారు. అక్కడి రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్రిప్టోలో కూడా పెట్టుబడి పెట్టారు. వాజ్మా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు.. సామాజిక కార్యకర్త కూడా. అఫ్గానిస్థాన్లోని పేద పిల్లల కోసం పనిచేస్తున్న చైల్డ్ఫండ్ సంస్థకు అంబాసిడర్గా ఉన్నారు. ఆమె జీవనశైలి, క్రికెట్ పట్ల మక్కువ, భారతీయ ఆటగాళ్ల పట్ల ఉన్న ఇష్టం ఆమెను నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తాయి. క్రికెట్ మైదానంలో వాజ్మా సందడి మాములుగా ఉండదు. మరోసారి ఆసియా కప్ 2025లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వజ్మా వచ్చిన మ్యాచ్లను భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువ. ఆమె ఇప్పుడు దుబాయ్లోనే ఉన్నారు. భారత్, పాక్ మ్యాచ్కు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్పై భారత్ విజయం పక్కా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..