Off The Record: రెండుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎక్కే ఫ్లైట్.. దిగే ఫ్లైట్ అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చాక.. తెలంగాణ పంచాయతీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. ఖర్గేతో మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతోంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ పాత పద్ధతిని వదులుకోవడం లేదట. మల్లికార్జున ఖర్గే దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీని మొదలుపెట్టారట. నాలుగైదు రోజులు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి.. పిసిసి కమిటీలపై కసరత్తు చేశారు. ఆ వెంటనే రేవంత్ వ్యతిరేక శిబిరం ఢిల్లీకి పయనమయింది. మల్లికార్జున ఖర్గే వద్ద రేవంత్ వ్యతిరేక శిబిరం.. పిసిసి చీఫ్ వ్యవ వ్యవహార శైలిని.. సమన్వయలేమి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారట. అదేరోజు రేవంత్ అనుకూల వర్గం ఢిల్లీకి వెళ్లింది. రేవంత్ పీసీసీ అయ్యాక పార్టీకి జోష్ వచ్చిందని చెప్తూనే.. పాత నాయకత్వం సహకరించడం లేదని.. వివాదాలన్నిటికీ రేవంత్ వ్యతిరేక శిబిరమే కారణం అంటూ ఫిర్యాదులు ఇచ్చి వచ్చిందట. సాధారణంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో గ్రూపులు కట్టడం మొదలవుతుంది. కానీ ఎన్నికలు ఏడాది ముందే ఇలాంటి గ్రూపులు కట్టే పరిస్థితి రావడం పార్టీకి తలనొప్పి తెచ్చే పరిస్థితి ఏర్పడింది.
Read Also: Off The Record: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మైలేజ్ గేమ్
Also Read
ఖర్గే దగ్గర తెలంగాణ పార్టీ పరిస్థితిని వివరించడం కంటే.. గ్రూపుల పంచాయతీ ఎక్కువైందట. రేవంత్ అనుకూల వర్గంలో నలుగురు నాయకులు ఖర్గేని కలిస్తే…అంతే సంఖ్యలో వ్యతిరేక శిబిరం కూడా ఖర్గేని కలుస్తోంది. మొదటి విడత ఈ వ్యవహారం ముగిసిన తర్వాత రెండో విడత మొదలైందట. గురువారం పార్టీ సీనియర్ నేత హనుమంతరావు.. కోదండ రెడ్డి.. దామోదర్ రాజనర్సింహ లాంటి సీనియర్ నేతలు అంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు అందుబాటులో లేకపోయినా.. ఆయన కోసం వెయిట్ చేస్తున్నారట. పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు వీళ్లందర్ని సమన్వయం చేస్తున్నట్టు రేవంత్ శిబిరం చర్చించుకుంటోంది. తెలంగాణలో రాజకీయమంతా అరెస్టులు.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలతో నడుస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత పంచాయతీలతో సతమతమవుతోంది. పార్టీలో ఉన్న పది మంది రెండు గ్రూపులుగా మారి ఢిల్లీలో చక్రం తిప్పే పనిలో పడ్డారని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. కాంగ్రెస్ లో అంతర్గత పంచాయతీలు కామన్ అయినా.. కలహాల కాపురం పార్టీనే కొంపముంచేలా ఉంది. నాయకులంతా ఐక్యంగా పనిచేయాల్సిన పరిస్థితిల్లో గ్రూపులుగా చీలిపోయి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..