Off The Record: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మైలేజ్ గేమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ సుదీర్ఘ ప్రక్రియ ఉండగానే 2017లో పోర్టు ఉన్న భూమికి పర్యావరణ అనుమతుల కాలం చెల్లిపోయింది. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు మరోసారి శంఖుస్థాపన చేశారు చంద్రబాబు. ఆ తర్వాత కోర్టు కేసులు ఇతరత్ర వ్యవహారాల వల్ల మరో మూడేళ్లు గడిచిపోయింది. తాజాగా వ్యవహారాలన్నీ కొలిక్కి వచ్చాయ్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 75శాతం అప్పుగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అటు వైపు పర్యావరణ అనుమతి కోసం ఢిల్లీ స్థాయిలో బందరు ఎంపీ బాలశౌరి ప్రయత్నాలు చేశారు. దీంతో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంత వరకు కథ సాఫీగానే నడిచినా…అసలు ట్విస్ట్ ఇక్కడే మొదయింది.
Read Also: Off the Record about Vizag YCP: విశాఖ జిల్లాలో తగాదాలపై వైసీపీ ఫోకస్
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ ఆమోద పత్రం రాగానే…స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఆ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి ఘనంగా ప్రకటించారు. పనిలో పనిగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లు చేయడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఈ ఎపిసోడ్తో ఎంపీ వర్గం…పేర్ని నానిపై కారాలు మిరియాలు నూరుతోంది. ఢిల్లీ లెవల్లో తాము చేసిన పనులను ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరులో తమ ప్రయత్నాన్ని ఎమ్మెల్యే కరివేపాకులా పక్కన పెట్టడాన్ని తప్పుబడుతోంది. పవర్ ఫైనాన్స్ అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా తామే సాధించామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేస్తోంది. అటు నేషనల్ హైవే అప్ గ్రేడేషన్ అంశాన్ని ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవటాన్ని ప్రశ్నిస్తోంది. 4 లేన్ల రోడ్డును 6 లేన్ల చేయాలని లోకల్ ఎంపీ ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ…ఎంపీని రెఫర్ చేస్తూ రాసిన లేఖను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంపీ వర్గీయులు పోర్టుకు పర్యావరణ అనుమతులను పునరుద్దరించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసిన విషయాన్ని ఎంపీ వర్గం గుర్తు చేస్తోంది. బందరు పోర్టుకు రుణం తీసుకొని రావడంలో ఎంపీ చూపిన చొరవతో భావనపాడు పోర్టు వ్యవహారాల బాధ్యతను కూడా ముఖ్యమంత్రి జగన్…ఎంపీ బాలశౌరిపై పెట్టారని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది.
చివరకు శంకుస్థాపన తేదీల విషయంలోనూ ఎంపీ ఒక మాట చెబితే…ఎమ్మెల్యే మరో డేట్ ఫిక్స్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా బందరు పోర్టు శంఖుస్థాపన చేయనున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఆనందంతో ఉబ్బితబ్బిబై ఎంపీ ఆ తేదీ ప్రకటించారంటూ…ఎమ్మెల్యే ఓపెన్గానే వ్యంగ్యస్త్రాలు వదిలారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య ఉన్న ఈ విభేదాలు…ఇక్డితో ఆగేటట్లు లేవు. వచ్చే ఎన్నికల్లో ఒకరిని ఒకరు ఊడగొట్టుకునే వరకు వెళ్లే పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. మరి పార్టీ హైకమాండ్ ఈ ఎపిసోడ్కు ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!