Off The Record: అసెంబ్లీకి గవర్నర్ తమిళిసై.. గవర్నర్, సర్కార్ మధ్య స్నేహం బలపడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగిస్తారు.అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో గవర్నర్కు, రాష్ట్ర సర్కార్కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య విమర్శల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రసంగంపై కుదిరిన సయోధ్యతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ ఉండటంతో ఏమి జరగబోతుంది అన్నఆసక్తి సర్వత్రా నెలకొంది. పలు రాష్ట్రాల్లో గవర్నర్, రాష్ట్ర సర్కార్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇక తాజాగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తీరుపై అక్కడి అధికార డీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే… మధ్యలోంచే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇటు తెలంగాణలో గవర్నర్ స్పీచ్కు సంబంధించి రాజ్భవన్, రాష్ట్ర సర్కార్ ఒక అభిప్రాయానికి వచ్చాయన్న చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్ గేమ్ నేతలపై హైకమాండ్ సీరియస్
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
ఇక చాలా గ్యాప్ తర్వాత గవర్నర్ తమిళిసై అసెంబ్లీకి వస్తుండటంతో అధికార BRSలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్ను మాత్రమే గవర్నర్ ఇవ్వాల్సి ఉంటుందనీ, సొంతంగా చెప్పడానికి ఉండదనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్ తమిళిసై, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో… ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్ను ఆమె యథాతథంగా ఇస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని మార్పులు చేసుకుని చెప్పినా ఆశ్చర్యపోనక్కర లేదని కూడా వాదనలున్నాయి. మొత్తంమీద గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగం సందర్భంగా చోటుచేసుకునే పరిణామాల ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీకి వస్తున్న గవర్నర్ తమిళిసై, రాష్ట్ర సర్కార్ మధ్య స్నేహం బలపడుతుందా… భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..