OTR about Janasena Party: జనసేనాని వడపోతలు..! పీఆర్పీలో పనిచేసిన నేతలకు గాలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే గెలిచింది. 2019లో వచ్చిన ఓట్లను దగ్గర పెట్టుకుని కొత్త సమీకరణాలతో గ్లాసు పార్టీ పెద్దలు కుస్తీ పడుతున్నారట. అప్పట్లో పీఆర్పీలో యాక్టివ్గా పనిచేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్న నేతల గురించి ఆరా తీస్తున్నారట. వారికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? జనసేనపై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారట. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్తవారే. ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన వారే. అయినప్పటికీ వారికి అప్పట్లో ఆస్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయి? పార్టీ మైలేజ్ ఎంత? ఓన్ వోట్ షేరింగ్ ఏముంది అనే సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారట జనసేన నాయకులు.
Read Also: Good News To Students: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. 21 నుంచి ట్యాబ్ల పంపిణీ
Also Read
గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్లలో ప్రస్తుతం వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరికొందరు ప్రతిపక్షంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే పూర్తిగా పాలిటిక్స్కి దూరమైన వాళ్ళు ఎవరున్నారు? వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుంటున్నారట. ఎప్పుడో అవుట్ డేటెడ్ నేతలు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని కొందరు అంటుంటే.. అదనపు బలం వస్తుంది కదా అని మరికొందరు వాదిస్తున్నారట. సామాజిక వర్గాల వారీగా పలానా నేత పలానా వారి దగ్గరికి వెళ్లి ప్రతిపాదన పెట్టాలని జనసేన నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయట. గతంలో పీఆర్పీలో పెద్దాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పంతం గాంధీ మోహన్ తర్వాత వైసీపీలో చేరినా సైలెంట్ అయ్యారు. పి గన్నవరంలో పోటీ చేసి ఓడిన జంగా గౌతమ్ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అటువంటి వారిపైనా దృష్టిపెట్టారట.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో పీఆర్పీ తరపున పని చేసిన వారిని తిరిగి యాక్టివ్ కావాలని కోరుతున్నారట జనసేన నాయకులు. ప్రస్తుతం సీటు మీద ఆశలు పెట్టుకున్న నేతలకు పొత్తుల్లో తమ ప్లేసు ఎక్కడ పోతుందోనన్న భయం నెలకొంది. ఇదే సమయంలో కొత్తవారు వస్తే కష్టమేనని ఆందోళన చెందుతున్నారట. అయితే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయని.. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జనసేన పెద్దల నుంచి వర్తమానం అందిందట. గెలుపోటములను డిసైడ్ చేసే వారూ ఉంటే కచ్చితంగా వారిని చేరదీయాలని స్పష్టం చేస్తున్నారట. మొత్తానికి అన్నయ్య సెలెక్ట్ చేసిన అభ్యర్థులు.. నేతలపై తమ్ముడు ఫోకస్ పెట్టారు. మరి ఈ కూడికలు తీసివేతలు ఫార్ములా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!