Good News To Students: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. 21 నుంచి ట్యాబ్ల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. 21వ తేదీన బాపట్ల జిల్లాలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం విదితమే కాగా.. విద్యార్థులకు పంపిణీ చేసే ట్యాబ్లలోనే బైజూస్ కంటెంట్ అప్ లోడ్ చేసి ఇవ్వనున్నారు.
Read Also: Minister KTR : మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రజలను బాధించారు
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 18 ట్యాబ్లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మండల కేంద్రాల్లో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాల్లో ట్యాబ్ల పంపిణీ కేంద్రాల ద్వారా ఈ పంపిణీ జరగనుంది.. జిల్లాల్లో కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి ఈ నెల 21న సీఎం జగన్ శ్రీకారం చుట్టనుండగా.. మరుసటి రోజు అంటే.. 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులకు ట్యాబల్ పంపిణీ జరగనుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే పలు సందర్భాల్లో వెల్లడించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!