OTR about Janasena Party: జనసేనాని వడపోతలు..! పీఆర్పీలో పనిచేసిన నేతలకు గాలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే గెలిచింది. 2019లో వచ్చిన ఓట్లను దగ్గర పెట్టుకుని కొత్త సమీకరణాలతో గ్లాసు పార్టీ పెద్దలు కుస్తీ పడుతున్నారట. అప్పట్లో పీఆర్పీలో యాక్టివ్గా పనిచేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్న నేతల గురించి ఆరా తీస్తున్నారట. వారికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? జనసేనపై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారట. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్తవారే. ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన వారే. అయినప్పటికీ వారికి అప్పట్లో ఆస్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయి? పార్టీ మైలేజ్ ఎంత? ఓన్ వోట్ షేరింగ్ ఏముంది అనే సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారట జనసేన నాయకులు.
Read Also: Good News To Students: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. 21 నుంచి ట్యాబ్ల పంపిణీ
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్లలో ప్రస్తుతం వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరికొందరు ప్రతిపక్షంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే పూర్తిగా పాలిటిక్స్కి దూరమైన వాళ్ళు ఎవరున్నారు? వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుంటున్నారట. ఎప్పుడో అవుట్ డేటెడ్ నేతలు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని కొందరు అంటుంటే.. అదనపు బలం వస్తుంది కదా అని మరికొందరు వాదిస్తున్నారట. సామాజిక వర్గాల వారీగా పలానా నేత పలానా వారి దగ్గరికి వెళ్లి ప్రతిపాదన పెట్టాలని జనసేన నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయట. గతంలో పీఆర్పీలో పెద్దాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పంతం గాంధీ మోహన్ తర్వాత వైసీపీలో చేరినా సైలెంట్ అయ్యారు. పి గన్నవరంలో పోటీ చేసి ఓడిన జంగా గౌతమ్ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అటువంటి వారిపైనా దృష్టిపెట్టారట.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో పీఆర్పీ తరపున పని చేసిన వారిని తిరిగి యాక్టివ్ కావాలని కోరుతున్నారట జనసేన నాయకులు. ప్రస్తుతం సీటు మీద ఆశలు పెట్టుకున్న నేతలకు పొత్తుల్లో తమ ప్లేసు ఎక్కడ పోతుందోనన్న భయం నెలకొంది. ఇదే సమయంలో కొత్తవారు వస్తే కష్టమేనని ఆందోళన చెందుతున్నారట. అయితే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయని.. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జనసేన పెద్దల నుంచి వర్తమానం అందిందట. గెలుపోటములను డిసైడ్ చేసే వారూ ఉంటే కచ్చితంగా వారిని చేరదీయాలని స్పష్టం చేస్తున్నారట. మొత్తానికి అన్నయ్య సెలెక్ట్ చేసిన అభ్యర్థులు.. నేతలపై తమ్ముడు ఫోకస్ పెట్టారు. మరి ఈ కూడికలు తీసివేతలు ఫార్ములా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!