Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record about BRS Sitting MLAs: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటు అధికార BRS పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు దక్కుతాయి..? కొత్తవారికి అవకాశం ఉంటుందా..? ఇటు విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ అభ్యర్థులుగా బరిలో ఉండేది ఎవరు అన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం పర్యటనలో కేటీఆర్ పర్యటన… ఆయన చేసిన కామెంట్స్తో ఆ నియోజవర్గ BRS అభ్యర్థి డిసైడ్ అయినట్టేనా? అన్న చర్చ జరుగుతోంది.
Read Also: TS Assembly Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వంసిద్ధం.. గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ
Also Read
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్లో కొత్త మంటలు!
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో TRS ఓటమి పాలైంది. ఈటల రాజేందర్కు పోటీగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగారు.అప్పుడే కాంగ్రెస్లో ఉన్న కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి MLCగా అవకాశం ఇచ్చారు కేసీఅర్. అప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి మధ్య అంతర్గతంగా నువ్వా- నేనా అన్నట్టు పోటీ రాజకీయాలు సాగుతూ వస్తున్నాయి. ఇద్దరు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా కేటీఆర్ హుజురాబాద్ పర్యటనలో చేసిన కామెంట్స్తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరో చెప్పకనే చెప్పారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: అసెంబ్లీకి గవర్నర్ తమిళిసై.. గవర్నర్, సర్కార్ మధ్య స్నేహం బలపడేనా?
మరోవైపు కౌశిక్రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే గెల్లు శ్రీనివాస్ పరిస్థితి ఎంటన్న చర్చ ఇప్పుడు BRSలో జరుగుతోంది. శ్రీనివాస్కు ఏదోఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారా… లేక మరేదైనా ఆఫర్ ఇస్తారా… అన్నది చూడాలి. ఇటు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కకపోతే… గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైలెంట్గా ఉంటారా, లేక మళ్లీ పోటీకి పట్టుబడతారా అన్నది తేలనుంది. మొత్తంమీద హుజురాబాద్ BRSలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో అక్కడ అధికార పార్టీలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది… నువ్వా- నేనా అన్నట్టు ఉన్న ఇద్దరిలో ఎవరు నెగ్గుతారు… ఎవరు తగ్గుతారు అనేది తేలాలంటే… కొంతకాలం వేచిచూడాల్సిందే!
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!