Off The Record: నామినేటెడ్ పోస్టుల చిచ్చు..! కూటమి ప్రభుత్వంలో అసంతృప్తులు పెరుగుతున్నాయా?
- నామినేటెడ్ పదవులు రాక పెరుగుతున్న అసంతృప్తులు..
- పొత్తు ధర్మంలో ఇబ్బందులు తప్పడం లేదంటున్న అధిష్టానం..
- డీ లిమిటేషన్ ఆశలతో అసంతృప్తిని చల్లబరిచే ప్రయత్నం..
- వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న ఆశలు..
- అందరికీ అవకాశాలు దక్కుతాయంటూ బుజ్జగింపులు..
- టీడీపీలో మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ మాటలు..
- ఎంతమంది కన్విన్స్ అవుతారన్న ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ విడతలవారీగా జరుగుతోంది. తాజాగా డీసీసీబీ, మార్కెట్ యార్డ్ కమిటీల పదవుల పందేరం నడుస్తోంది. అదే సమయంలో అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు రానివాళ్ళతో పాటు పార్టీ వీర విధేయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ అధిష్టానం చెబుతున్నా…. అదే రేంజ్లో ఉన్న అందర్నీ సంతృప్తి పరచడం మాత్రం సాధ్యం కావడం లేదట. ప్రత్యేకించి పొత్తు ధర్మంలో మూడు పార్టీల మధ్య సర్దుబాట్లు అవసరమైనందున ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో టిక్కెట్లు రాక, ఇప్పుడు నామినేటెడ్ పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులను కొత్త రకంగా బుజ్జగిస్తోందట టీడీపీ అధిష్టానం. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, అప్పుడు ఎలాగూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి…అందరికీ అవకాశాలు వస్తాయని నచ్చజెపుతున్నట్టు సమాచారం.
Read Also: WTC Final- IPL 2025: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎఫెక్ట్.. ఐపీఎల్లో ఆ జట్లకు బిగ్ షాక్!
Also Read
నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నా…. అవకాశాలు మాత్రం కొద్ది మందికే దక్కుతున్నాయి. అందుకే… ఆశావహులందరికీ డీ లిమిటేషన్ ఆశ చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దీని గురించి తెగ చర్చ జరుగుతోంది టీడీపీ సర్కిల్స్లో. అధిష్టానం డీ లిమిటేషన్ ఆశలు చూపుతున్నా…. ఎక్కువ మంది ఆ విషయంలో కన్విన్సింగ్గా లేరట. ఆకలైనప్పుడు పెట్టే ఇడ్లీ ముఖ్యంగాని, కడుపు నిండాక బిర్యానీ పెట్టినా ఏం ప్రయోజనం అంటూ నిరాసక్తతగా మాట్లాడే నాయకుల సంఖ్య పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వస్తే పార్టీ లీడర్స్కు మంచి అవకాశాలు ఉంటాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఓవైపు డీ లిమిటేషన్, మరోవైపు మహిళా రిజర్వేషన్ ఈ రెండూ అమల్లోకి వస్తే… చాలావరకు సమస్య తీరిపోతుందన్నది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్నా… ఇంకా చాలావరకు చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయినా సరే… అసంతృప్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాన్ని చల్లార్చడానికి డీ లిమిటేషన్ ఆశలు చూపుతున్నా… నేతలు ఎంతవరకు కన్విన్స్ అవుతారన్నది క్వశ్చన్ మార్క్ అంటున్నారు పరిశీలకులు.
Read Also: Law College: శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి
ఇప్పటికే రకరకాల కారణాలతో చాలామందికి గత ఎన్నికల్లో టికెట్లు రాలేదు. ప్రధానంగా జనసేనతో పొత్తుతో టిక్కెట్లు కోల్పోయామన్న అసహనం ఎక్కువ మంది టీడీపీ నేతల్లో ఉందట. అలాంటి వాళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లో మంచి నామినేటెడ్ పదవి సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అంత పట్టుదలతో ఉన్న నాయకులు పార్టీ అధిష్టానం మబ్బుల్ని చూపించి అదిగో నవలోకం అంటే వింటారా అన్నది అనుమానమేనని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా చాలా నామినేటెడ్ పోస్ట్లు ఖాళీగా ఉన్నందున ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తున్నారు ఎక్కువ మంది. అదిపోయి ఇక ఇప్పటికింతే… అని తెలిస్తే మాత్రం… వాళ్ళ నిర్ణయాలు, చర్యలు ఎలా ఉంటాయన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!