Law College: శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి
- శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం..
- ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు షురూ..
- ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి..
- గతంలో న్యాయశాఖ మంత్రిని కలిసిన బండి సంజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Law College: కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) మంజూరు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. లా కాలేజీ అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 120 మంది విద్యార్థులతో (రెండు సెక్షన్లు) ఎల్ఎల్ బీ కోర్సు ప్రారంభం కానుంది. అయితే, శాతవాహన వర్శిటీలో లా కళాశాల మంజూరు చేయాలని కోరుతూ వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ గతంలో బండి సంజయ్ ను కోరారు. ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో వీసీ ఉమేశ్, మాజీ మేయర్ సునీల్ రావును వెంటబెట్టుకుని ఢిల్లీలోని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి లా కాలేజీని మంజూరు చేయాలని బండి సంజయ్ కోరారు.
Read Also: Virat Kohli: టెస్ట్ క్రికెట్లో ముగిసిన రోకో శకం.. టీమిండియాను నడిపించే నాయకుడెవరు?
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
అయితే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై వర్చువల్ గా శాతవాహన వర్శిటీని తనిఖీ చేయడంతో పాటు వివరణలతో కూడిన నివేదిక కోరినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ కు విషయాన్ని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపినట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అతి త్వరలోనే శాతవాహన వర్శిటీకి అనుబంధంగా లా కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సు ప్రారంభమైతుందని హామీ ఇచ్చారు. ఇక, న్యాయశాఖ మంత్రి ఇచ్చిన మాట ప్రకారం లా కాలేజీ అనుమతికి రావడంతో.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కేంద్రమంత్రి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?