Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lpg Shortage Hcltech Offers Work From Home As Office Cafeterias Disrupted

Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..

Published Date :March 12, 2026 , 4:12 pm
By Burugadda Veerababu
  • వంట గ్యాస్ కష్టాలు ఐటీ ఉద్యోగులకు కూడా..
  • క్యాంటీన్ మూసేయడంతో వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ చేసిన టెక్ కంపెనీ..
  • ఇన్పోసిస్‌లో కూడా ఇదే పరిస్థితి..
Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వంట గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు ఐటీ కంపెనీలపై కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సంస్థ HCLTech చెన్నై కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి 12, 13 తేదీలలో వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థలోని ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించారు. చెన్నై కార్యాలయంలోని క్యాంటీన్లలో పనిచేసే వారు వంట గ్యాస్ కొరత కారణంగా సేవలు అందించలేకపోతున్నారు. దీంతో ఉద్యోగులకు ఆహార సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ అనుమతించింది.

ప్రభుత్వం భరోసా ఇచ్చినా కూడా వంట గ్యాస్ కొరత కొనసాగుతుండటంతో దేశంలోని అనేక రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై చేపట్టిన చర్యల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. దాని ప్రభావం భారత కంపెనీలపైనా క్రమంగా కనిపిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.144 పెంచారు. దీంతో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఈ అంశంపై అధికారికంగా స్పందించాలంటూ HCLTech సంస్థకు ఈమెయిల్ పంపినప్పటికీ ఇంకా సమాధానం రాలేదని సమాచారం.

Also Read

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!

Also Read:Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..

ఇదిలా ఉండగా.. మరో ఐటీ దిగ్గజం Infosys కూడా తమ ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని క్యాంటీన్లలో సాధారణంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించనున్నట్లు తెలిపింది. కమర్షియల్ వంట గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి ఉన్నందున కొన్ని ఫుడ్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసింది. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచి ఆహారం తీసుకురావాలని సూచించింది. గత ఏడాది చివరి నాటికి Infosys సంస్థలో సుమారు 3.37 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. HCLTech సంస్థలో 2.26 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు.

Also Read:Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంతో వ్యాపార సంబంధాలు ఉన్న కంపెనీలు కొత్త సీనియర్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయని గ్లోబల్ రిక్రూట్‌మెంట్ సంస్థలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ ఘర్షణలో ఆ ప్రాంతంలోని అనేక దేశాలు కూడా చేరాయి. దీనితో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా ఉండే అవకాశం ఉంది. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ వంటి దేశాల్లో 90 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత కంపెనీలు తమ ఉద్యోగుల స్థానాలను గుర్తించి, భద్రతా చర్యలపై సూచనలు ఇస్తూ ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అయితే ఈ పరిస్థితుల అసలు ప్రభావం రాబోయే నెలల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru IT news
  • Commercial LPG price Hike
  • cooking gas shortage India
  • HCLTech Chennai news
  • HCLTech WFH news

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions