Off The Record: AB వెంకటేశ్వర రావు పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారా..?
- 2024లో నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం..
- ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి..
- నెలలు గడుస్తున్నా ఛార్జ్ తీసుకోని ఏబీ వెంకటేశ్వరరావు..
- తన స్థాయికి తగ్గ పదవి కాదనే తీసుకోలేదా?..
- సొంత ప్లాట్ఫాం ద్వారా కార్యక్రమాలు..
- వైసీపీ హయాంలో ఇబ్బందిపడ్డవాళ్ళకు పరామర్శలు..
- బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ మీటింగ్..
- బనకచర్లను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం..
- తాను టీడీపీకి అనుబంధంగా లేనని చెప్పదల్చుకున్నారా?..
- తాజాగా నూజివీడులో ఏబీవీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు… రిటైర్డ్ ఐపీఎస్. 2014 – 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో… ఇంటెలిజెన్స్ చీఫ్గా వెలుగు వెలిగినట్టు చెప్పుకుంటారు. అప్పట్లో ఆయన నిర్ణయాలు, సలహాలకు తూచా తప్పకుండా అమలయ్యేవని చాలాసార్లు చెప్పేవారు వైసీపీ నాయకులు. కారణం ఏదైనా…. 2019లో వైసీపీ పవర్లోకి వచ్చాక ఏబీవీకి చుక్కలు కనపడ్డాయన్నది విస్తృతాభిప్రాయం. ఆయన మీద అప్పటి ప్రభుత్వం సస్పెన్శన్ వేటు, ఆయన న్యాయ పోరాటం గురించి అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఆ పోరాటంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. టీడీపీ కూడా సందర్భాన్ని బట్టి ఆ ఇష్యూని వాడుకుందన్న అభిప్రాయాలున్నాయి. అదే ఊపులో… 2024 ఎన్నికల్లో ఏబీవీ నూజివీడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని చెబుతారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ మాజీ ఐపీఎస్ వ్యవహారశైలి కాస్త తేడాగా ఉందన్న చర్చలు మొదలయ్యాయి.
Read Also: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ఏబీవీకి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది కూటమి సర్కార్. కానీ… నెలలు గడిచిపోతున్నా… ఇప్పటి వరకు ఆ కుర్చీలో కూర్చోలేదాయన. తన స్థాయి, అప్పట్లో తాను చేసిన సేవలకు అది చాలా చిన్న పోస్ట్ అన్నది ఆయన అభిప్రాయంగా చెప్పుకుంటారు. నచ్చకనే ఛార్జ్ తీసుకోలేదట. ఇటీవల తన సొంత ప్లాట్ ఫాం ద్వారా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారాయన. అందులో… గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన వారిని పరామర్శించడం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం లాంటివి ఉన్నాయి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి లబ్ధి చేకూరుతుందని, కేంద్రం అనుమతి ఇవ్వాలని ఒకవైపు ప్రభుత్వం కోరుతుంటే…. దానివల్ల నష్టం జరుగుతుందని పార్టీ మనిషిగా చెప్పుకునే ఏబీ వెంకటేశ్వరరావు మీటింగులు పెట్టి మరీ ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది. అంటే… దీన్ని బట్టి తాను టీడీపీకి అనుబంధంగా లేనని, సొంత ప్లాట్ఫాం ద్వారానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పదల్చుకున్నారా అన్నది కొత్తగా వస్తున్న డౌట్. ఈ క్రమంలో తాజాగా నూజివీడులో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన ఎవరిని టార్గెట్ చేశారంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
Read Also: Donald Trump: భారత్, రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. టారిఫ్స్కు సిద్ధం కావాలని హెచ్చరిక!
నూజివీడులో డ్వాక్రా గ్రూపు బుక్ కీపర్ విషయమై ఏబీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు కష్టపడి ప్రభుత్వాన్ని మార్చినా….వైసీపీ గుండాలు టిడిపిలో చేరి ఇంకా అరాచకాలు చేస్తున్నారని కామెంట్ చేశారాయన. వైసీపీ హయాంలో డబ్బు దోచుకున్న వారంతా… టిడిపి కండువా కప్పుకుని ఇప్పుడు కూడా అలాగే… జనాలను వేధిస్తున్నారని, ఈ వ్యవహారంపై టిడిపి అధిష్టానం దృష్టి పెట్టాలని కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారాయన. దీంతో ఎవర్ని టార్గెట్ చేశారన్న ఆరాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రి పార్థసారధి ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారే. స్థానికుడు కాకున్నా… కూటమి హవాలో గెలిచారన్న టాక్ ఉంది సారధి విషయంలో. ప్రస్తుతం ఆయన వర్గం నేతలను ఉద్దేశించే ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ గుండాలు టిడిపిలో చేరారంటూ మాట్లాడి ఉండవచ్చంటున్నారు. శివ సాయి అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకుడుగా ఉన్నాడని, వాళ్ళ వెనకాల కొంతమంది పెత్తందారులు కూడా ఉన్నారంటూ ఏబీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలకు అటు మంత్రి మనుషులు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు స్వరం పెంచితే… అది టీడీపీకి ఇబ్బంది కావచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!