Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ త్రిశూల వ్యూహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన త్రిశూల వ్యూహాన్ని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Off The Record: వైసీపీలో పరిణామాలతో టీడీపీలో కలవరం..! నాటి సీన్ రిపీట్ అవుతుందా..?
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఈజీగా గెలిచే పరిస్థితి ఉందని సునీల్ తెలిపారట. నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించి కీలక సూచనలు చేశారట. అందులో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనేది వివరించారట. గ్రేటర్ హైదరాబాద్లో MIM నియోజకవర్గాలుగా ముద్రపడ్డ చోట పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం. కాకపోతే ఆ వర్గాలకు ఇంకా దగ్గరవ్వాలనే సూచన చేశారట వ్యూహకర్త. సునీల్ చెప్పినట్టుగా 119 నియోజకవర్గాలను మూడు విభాగాలుగా వర్గీకరించి పనిచేయాలని అనుకుంటున్నారట. నియోజకవర్గాలను గ్రీన్.. ఆరెంజ్.. రెడ్ జోన్లుగా విభజించారు వ్యూహకర్త. కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే నియోజకవర్గాలను గ్రీన్జోన్గా ప్రస్తావించారు. ఈ విభాగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు.. గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన సెగ్మెంట్లు.. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన నియోజకవర్గాలు ఉన్నాయట. వీటిల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణ ఉందని సునీల్ తెలిపారట.
Read Also: Off The Record: బైరెడ్డి టోన్ మారుతోందా? మళ్లీ టీడీపీకి చేరువ అవుతున్నారా..?
ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఫలితం సానుకూలంగా ఉంటుందని ఆయన తేల్చారట. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని.. అన్ని రకాలుగా ఫోకస్ పెడితే పార్టీ ఆశించిన రిజల్ట్స్ వస్తాయని నివేదికలో పొందుపర్చారట. గ్రీన్, ఆరెంజ్ జోన్లోకి రాని మిగతా నియోజకవర్గాలను రెడ్ జోన్లో ఉంచారు వ్యూహకర్త సునీల్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలను ఈ జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ల విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. వ్యూహకర్త చెప్పిన ఈ మూడ్ జోన్లనే త్రిశూల వ్యూహంగా చర్చిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో.. ఎన్నికల సమర తంత్రాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!