Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ త్రిశూల వ్యూహం..!
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన త్రిశూల వ్యూహాన్ని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Off The Record: వైసీపీలో పరిణామాలతో టీడీపీలో కలవరం..! నాటి సీన్ రిపీట్ అవుతుందా..?
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఈజీగా గెలిచే పరిస్థితి ఉందని సునీల్ తెలిపారట. నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించి కీలక సూచనలు చేశారట. అందులో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనేది వివరించారట. గ్రేటర్ హైదరాబాద్లో MIM నియోజకవర్గాలుగా ముద్రపడ్డ చోట పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం. కాకపోతే ఆ వర్గాలకు ఇంకా దగ్గరవ్వాలనే సూచన చేశారట వ్యూహకర్త. సునీల్ చెప్పినట్టుగా 119 నియోజకవర్గాలను మూడు విభాగాలుగా వర్గీకరించి పనిచేయాలని అనుకుంటున్నారట. నియోజకవర్గాలను గ్రీన్.. ఆరెంజ్.. రెడ్ జోన్లుగా విభజించారు వ్యూహకర్త. కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే నియోజకవర్గాలను గ్రీన్జోన్గా ప్రస్తావించారు. ఈ విభాగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు.. గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన సెగ్మెంట్లు.. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన నియోజకవర్గాలు ఉన్నాయట. వీటిల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణ ఉందని సునీల్ తెలిపారట.
Read Also: Off The Record: బైరెడ్డి టోన్ మారుతోందా? మళ్లీ టీడీపీకి చేరువ అవుతున్నారా..?
ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఫలితం సానుకూలంగా ఉంటుందని ఆయన తేల్చారట. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని.. అన్ని రకాలుగా ఫోకస్ పెడితే పార్టీ ఆశించిన రిజల్ట్స్ వస్తాయని నివేదికలో పొందుపర్చారట. గ్రీన్, ఆరెంజ్ జోన్లోకి రాని మిగతా నియోజకవర్గాలను రెడ్ జోన్లో ఉంచారు వ్యూహకర్త సునీల్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలను ఈ జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ల విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. వ్యూహకర్త చెప్పిన ఈ మూడ్ జోన్లనే త్రిశూల వ్యూహంగా చర్చిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో.. ఎన్నికల సమర తంత్రాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!