BJP : బీజేపీలో ఈటలతో చేరిన వలస నేతల గగ్గోలు..గుర్తింపు లేదని ఏడుపు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో వలస నేతలకు నిప్పులపై నిల్చున్నట్టు ఉందట. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల రాజేందర్తోపాటు హుజూరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లోని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత జిల్లా బీజేపీలో ప్రాధాన్యం దక్కుతుందని లెక్కలేసుకున్నారట. అప్పటికే పార్టీ పదవుల కోసం జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అనే యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో వలస నేతలు గుర్తింపు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.
ఎమ్మెల్యే ఈటలను కలిసి.. మీతోపాటు బీజేపీలోకి వచ్చాం.. తమకు పార్టీలో తగిన గౌరవం.. గుర్తింపు లేదని చెప్పి వాపోతున్నారట. మూడ్రోజుల క్రితం హుజూరాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో స్వయంగా ఈటల చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. తమ వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందరూ కలిసి పనిచేసేలా జిల్లా నాయకత్వం చూడాలని ఈటల కోరారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేయాలని అనుచరులను బుజ్జగించారట. దీంతో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి.. ప్రస్తుతం బీజేపీలో కనీసం గౌరవ మర్యాదలు దొరకడం లేదని నాలుగు గోడల మధ్య ఆవేదన చెందుతున్నారట వలస నాయకులు.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
కరీంనగర్ జిల్లా బీజేపీలో నెలకొన్న వర్గ విభేదాలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదనే చర్చ ఉంది. ఇప్పటికే జిల్లాలోని బీజేపీ సీనియర్లకు జిల్లా, రాష్ట్ర కమిటీలతో చోటు దక్కలేదు. పలుమార్లు రహస్య సమావేశాలు పెట్టుకోవడం.. ఆ తర్వాత సైలెంట్ కావడం.. ఆపై రచ్చ రచ్చ అవడం పార్టీలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. పైగా టీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి వచ్చిన నాయకులను, కార్యకర్తలను బీజేపీలో కలుపుకొని వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే వైఖరి కొనసాగితే వచ్చే రోజుల్లో పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే జిల్లా కావడంతో.. ఆయనకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తోందట. బయట పడకపోయినా.. తన వర్గానికి జరుగుతున్న అవమానాలపై ఈటల కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. వలస నాయకుల అసంతృప్తిని చల్లార్చడానికి కమలనాథులు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!