Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Mp Vijaysai Action Plan On North Andra Ysrcp

Mp Vijaysai Garrage: పార్టీని గాడిలో పెడతారా?

Published Date :February 21, 2022 , 1:44 pm
By NTV WebDesk
Mp Vijaysai Garrage: పార్టీని గాడిలో పెడతారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?
ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా. ఇక్కడ బీసీ, కాపు సామాజికవర్గాలు ఎవరికి కొమ్ముకాస్తే వాళ్లే విజేతలు. గత ఎన్నికల్లో ఈ ఫార్ములాను గట్టిగా పట్టుకోవడమే కాకుండా పక్కాగా వర్కవుట్ చేసింది వైసీపీ. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకుగాను టీడీపీ గెలిచింది ఆరు చోట్లే. విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్‌స్వీప్ చేయగా.. శ్రీకాకుళంలో రెండు, విశాఖ సిటీలో నాలుగుచోట్ల సైకిల్ పార్టీ గెలిచింది. ఈ రెండున్నరేళ్లలో ఫ్యాన్ పార్టీ జోష్ తగ్గలేదు. అయితే అంతర్గతంగా మాత్రం నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోంది. గ్రూప్ రాజకీయాల వేడిలో కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చలి కాచుకోవడం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.

ప్రమాదకర సంకేతాలు పంపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు
వైసీపీ ద్వితీయశ్రేణికి, కేడర్‌కు అండగా నిలవడం ద్వారా పార్టీ పటిష్టత కోసం పని చేయాల్సిన ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ప్రమాదకర సంకేతాలు పంపించాయి. మూడు జిల్లాల్లోనూ అసంతృప్తులు ఉండగా.. ఇటీవల పాయకరావుపేట, టెక్కలిలో విభేదాలు రోడ్డెక్కాయి. చాలా నియోజకవర్గాలలో ఆధిపత్య రాజకీయం శ్రుతిమించుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాలిటిక్స్. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ జడ్పీటీసీగా ఓడిపోయారు. ఇదే జిల్లాలో మిగతా అన్నిచోట్ల వైసీపీ గెలిచింది. ఇవన్నీ కొన్ని లెక్కలు మాత్రమే. అందుకే వైసీపీ హైకమాండ్ కీలక చర్యలకు ఉపక్రమించింది.

నియోజకవర్గాల వారీగా వైసీపీ సమీక్షలు
నేతల మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడం.. పార్టీ గెలుపుకోసం పోరాటం చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేలా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధ అవుతోంది వైసీపీ. ఆ పని ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టనుండగా ఆ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల్లో పెట్టింది హైకమాండ్. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు రాజకీయ సమీక్షలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ కేంద్రాలకు వెళ్లినప్పుడు మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశనిర్ధేశం జరిగినట్టు వినికిడి. అలాగే ఆధిపత్య పోరుపైనా ఫోకస్‌ పెడతారట.

యాక్షన్‌ ప్లాన్‌ తెలిసి ఎమ్మెల్యేలు అప్రమత్తం
ఈ నెల 22 నుంచి సమీక్షలు ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం. ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేరాయి..!? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయడం వంటి కంప్లీట్ టాస్క్ సాయిరెడ్డి చేతుల్లో పెట్టినట్టు పార్టీవర్గాల అంతర్గత చర్చ. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ నేరుగా అధిష్ఠానానికి చెప్పుకునే వెసులుబాటు లేదు. ఉత్తరాంధ్రలో పార్టీకి బాధ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ సమావేశాలు.. ఇతర పనులు కారణంగా బిజీగా ఉంటున్నారు. కొద్దికాలంగా ఆయన రాజకీయ దూకుడు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఫోకస్ ఉంచారు. ఆయన నిర్వహిస్తోన్న ప్రజాదర్భార్‌కు విశేష స్పందన వస్తోందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. సాయిరెడ్డి యాక్షన్‌ ప్లాన్‌ తెలిసినప్పటి నుంచీ కొందరు ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారట. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని బహిరంగంగా చెబుతూనే సయోధ్యకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics.
  • off the record
  • party problems
  • srikakulam
  • viay sai action

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions