Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..
- తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం
- ఇటీవల తిరిగి యాక్టివ్ అయిన పువ్వాడ అజయ్
- మమత మెడికల్ కాలేజీలో ఆత్మీయ సమ్మేళనం
- కబ్జా చేసిన స్థలంలో కార్యక్రమం అంటూ మంత్రి తుమ్మల కామెంట్స్
- మంత్రి మీద పువ్వాడ సీరియస్ వ్యాఖ్యలు
- రెండు వర్గాల మధ్య ఓ రేంజ్లో సోషల్ మీడియా యుద్ధం
- 2014 నుంచే ఇద్దరి మధ్య రాజకీయ పోరు
- మెడికల్ కాలేజీ స్థలం కబ్జా చేసిందేనన్న తుమ్మల
- రెగ్యులర్ చేసినప్పుడు మీరు మంత్రి కాదా అని పువ్వాడ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం అంతకంతకూ పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి… తిరిగి యాక్టివ్ అవడంతో… రాజకీయం రంజుగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిన టైంలో ఈ పోరు పొలిటికల్ హీట్ పెంచుతోంది. అనారోగ్య కారణాలతో కొంత కాలం లోకల్ కేడర్కు దూరంగా ఉన్నారు పువ్వాడ. కానీ… ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారాయన. ఇందులో భాగంగానే తనకు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మమత మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కేడర్ని రప్పించారు. దీనికి మాజీ మంత్రి హరీష్రావు కూడా అటెండ్ అయ్యారు. అక్కడి నుంచి అసలు గేమ్ మొదలైంది. హరీష్రావును టార్గెట్ చేస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి తుమ్మల.
Read Also: Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
Also Read
అది పుట్టిన రోజో, ఆత్మీయ సమావేశమో, లేక బీఆర్ఎస్ ప్లీనరీనో నాకు తెలియదుగానీ… అంటూనే కార్యక్రమం పెట్టింది కబ్జా స్థలంలో అని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు మంత్రి. కబ్జా స్థలంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేశావు హరీష్ అంటూ తుమ్మల చేసిన కామెంట్తో పువ్వాడ ఫైరైపోయారు. మంత్రిని ఉద్దేశించి అంతే సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. ఇక ఇదే అదనుగా ఇద్దరు నేతల అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో యుద్ధం మొదలుపెట్టారు. 2014 నుంచే పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోరు జరుగుతోంది. అప్పట్లో అజయ్ చేతిలో ఓడిపోయారు తుమ్మల. ఆ తర్వాత ఆయన్ని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దీంతో అప్పట్లో మినిస్టర్గా తుమ్మల, ఎమ్మెల్యేగా అజయ్ ఒకే పార్టీలో ఉన్నా… ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఇక 2018లో మంత్రి పదవి కోసమే తనను ఓడించారంటూ పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు చేశారు తుమ్మల నాదేశ్వరరావు.
ఒక పార్టీలో ఉన్నప్పుడే సఖ్యత కుదరని ఇద్దరు నాయకులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నందున రాజకీయ యుద్ధానికి తెరతీస్తున్నారట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పువ్వాడను ఓడించారు. ఇక మమత మెడికల్ కళాశాల ఉన్న స్థలం కబ్జా చేసింది, అజయ్ అనుచర వర్గం కూడ కబ్జా రాయుళ్లే అంటూ తుమ్మల ఆరోపిస్తుంటారు. అయితే ఆ కబ్జా అని చెబుతున్న స్థలాన్ని రెగ్యులర్ చేసినప్పడు తుమ్మల మంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నారు పువ్వాడ. ఇలా నాయకులు ఇద్దరూ చూస్కుందామంటే చూస్కుందాం… రా… అన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!