Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..
- తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం
- ఇటీవల తిరిగి యాక్టివ్ అయిన పువ్వాడ అజయ్
- మమత మెడికల్ కాలేజీలో ఆత్మీయ సమ్మేళనం
- కబ్జా చేసిన స్థలంలో కార్యక్రమం అంటూ మంత్రి తుమ్మల కామెంట్స్
- మంత్రి మీద పువ్వాడ సీరియస్ వ్యాఖ్యలు
- రెండు వర్గాల మధ్య ఓ రేంజ్లో సోషల్ మీడియా యుద్ధం
- 2014 నుంచే ఇద్దరి మధ్య రాజకీయ పోరు
- మెడికల్ కాలేజీ స్థలం కబ్జా చేసిందేనన్న తుమ్మల
- రెగ్యులర్ చేసినప్పుడు మీరు మంత్రి కాదా అని పువ్వాడ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం అంతకంతకూ పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి… తిరిగి యాక్టివ్ అవడంతో… రాజకీయం రంజుగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిన టైంలో ఈ పోరు పొలిటికల్ హీట్ పెంచుతోంది. అనారోగ్య కారణాలతో కొంత కాలం లోకల్ కేడర్కు దూరంగా ఉన్నారు పువ్వాడ. కానీ… ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారాయన. ఇందులో భాగంగానే తనకు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మమత మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కేడర్ని రప్పించారు. దీనికి మాజీ మంత్రి హరీష్రావు కూడా అటెండ్ అయ్యారు. అక్కడి నుంచి అసలు గేమ్ మొదలైంది. హరీష్రావును టార్గెట్ చేస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి తుమ్మల.
Read Also: Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
Also Read
అది పుట్టిన రోజో, ఆత్మీయ సమావేశమో, లేక బీఆర్ఎస్ ప్లీనరీనో నాకు తెలియదుగానీ… అంటూనే కార్యక్రమం పెట్టింది కబ్జా స్థలంలో అని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు మంత్రి. కబ్జా స్థలంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేశావు హరీష్ అంటూ తుమ్మల చేసిన కామెంట్తో పువ్వాడ ఫైరైపోయారు. మంత్రిని ఉద్దేశించి అంతే సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. ఇక ఇదే అదనుగా ఇద్దరు నేతల అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో యుద్ధం మొదలుపెట్టారు. 2014 నుంచే పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోరు జరుగుతోంది. అప్పట్లో అజయ్ చేతిలో ఓడిపోయారు తుమ్మల. ఆ తర్వాత ఆయన్ని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దీంతో అప్పట్లో మినిస్టర్గా తుమ్మల, ఎమ్మెల్యేగా అజయ్ ఒకే పార్టీలో ఉన్నా… ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఇక 2018లో మంత్రి పదవి కోసమే తనను ఓడించారంటూ పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు చేశారు తుమ్మల నాదేశ్వరరావు.
ఒక పార్టీలో ఉన్నప్పుడే సఖ్యత కుదరని ఇద్దరు నాయకులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నందున రాజకీయ యుద్ధానికి తెరతీస్తున్నారట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పువ్వాడను ఓడించారు. ఇక మమత మెడికల్ కళాశాల ఉన్న స్థలం కబ్జా చేసింది, అజయ్ అనుచర వర్గం కూడ కబ్జా రాయుళ్లే అంటూ తుమ్మల ఆరోపిస్తుంటారు. అయితే ఆ కబ్జా అని చెబుతున్న స్థలాన్ని రెగ్యులర్ చేసినప్పడు తుమ్మల మంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నారు పువ్వాడ. ఇలా నాయకులు ఇద్దరూ చూస్కుందామంటే చూస్కుందాం… రా… అన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..