CWG 2026: కామన్వెల్త్ గేమ్స్లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CWG 2026 Medal Tally: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండుతోంది. ముఖ్యంగా బాక్సింగ్లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 పతకాలు సాధించారు. దీంతో భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి సాంప్రదాయ క్రీడలు ఈసారి లేకపోయినా.. భారత క్రీడాకారులు ఇతర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ దేశానికి గర్వకారణంగా నిలిచారు.
భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను అందించింది. మహిళల 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకుంది. అంతకుముందు పారా పవర్లిఫ్టింగ్లో జండూ కుమార్ కాంస్య పతకం సాధించి ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచాడు. పారా అథ్లెటిక్స్లో శర్మిలా ధంకర్, దిలీప్ గవిత్, సోమన్ రాణా స్వర్ణ పతకాలు సాధించగా.. జూడోలో అస్మితా దే, హర్ష్ సింగ్ బంగారు పతకాలు గెలిచి భారత్కు విజయాలు అందించారు.
Also Read
- Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
- WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
- Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
బాక్సింగ్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుష్ పంఘాల్ గోల్డ్ మెడల్స్ గెలిచి భారత పతకాల సంఖ్యను మరింత పెంచారు. రజత పతకాల విభాగంలో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్, హైజంప్లో సర్వేశ్ కుషారే, వెయిట్లిఫ్టింగ్లో రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, లవ్ప్రీత్ సింగ్, అజయ బాబు రజత పతకాలు సాధించారు.
కాంస్య పతకాలలో యశ్వీర్ సింగ్ జావెలిన్ త్రోలో, తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో, గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల పరుగులో, సెల్వ ప్రభు ట్రిపుల్ జంప్లో, సీమ కలిరమణ డిస్కస్ త్రోలో, బింద్యారాణి దేవి వెయిట్లిఫ్టింగ్లో, శిల్పా శైలా పారా అథ్లెటిక్స్లో, ఉన్నతి శర్మ జూడోలో, జండూ కుమార్ పారా పవర్లిఫ్టింగ్లో కాంస్య పతకాలు గెలిచారు. ముఖ్యంగా గుల్వీర్ సింగ్ ఒకే కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెటిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర సృష్టించగా.. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో భారత్కు తొలి కామన్వెల్త్ పతకం అందించాడు.
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో జూడో, ట్రాక్ సైక్లింగ్ వంటి విభాగాల్లో భారత్కు మరిన్ని పతకాల అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 39 పతకాలతో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. 40కి పైగా పతకాలతో ఈ క్రీడలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగియనున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!