టీటీడీ జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వ ప్రయత్నం సఫలమయ్యేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి?
సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..!
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి కూడా కావాలని పట్టుబట్టి దక్కించుకుంటున్నారు. ఈ ఒత్తిళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి. గతంలో 18 మంది సభ్యులుంటే.. బోర్డులో చోటు ఆశిస్తున్నవారి సంఖ్య అంతకు రెట్టింపు ఉండటంతో చట్ట సవరణ చేసి.. 25కు పెంచారు. నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు.. 8 మంది ప్రత్యేక ఆహ్వానితులతో అది 37కు చేరుకుంది. ఈసారి ఏకంగా 81 మందితో జంబో పాలకమండలిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రెండు జీవోలను సస్పెండ్ చేసిన హైకోర్టు..!
1987 దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో పాలకమండలి సభ్యుల సంఖ్య 29కి మించకూడదు. ఆరుగురితో మొదలైన పాలకమండలి ఇప్పుడు 29కి చేరింది. ఇక ఇతర సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రంలోని పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతుల సిఫారసులతో అది 81కి చేరింది. 25 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్లు ఆహ్వానితులు కాగా.. మరో 51 మందిని ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో జీవోలు వచ్చాయి. ఈ చర్యను టీడీపీ, బీజేపీ నాయకులు కోర్టులో సవాల్ చేయడంతో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన రెండు జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఆర్డినెన్స్ తెస్తారా?
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. చట్ట సవరణ చేసి ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని చేర్చబోతున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. నవంబర్లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో చట్ట సవరణ చేస్తారని సమాచారం. ఆ విధంగా సమస్యను పరిష్కరించే యోచనలో పెద్దలు ఉన్నారట. అయితే ఆర్డినెన్స్ జారీ చేసినా.. తిరిగి కోర్టు తలుపులు తడతామంటున్నారు పిటిషనర్లు. అందుకే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మరి.. ఆహ్వానితుల జాబితాలో ఉన్నవారి ఆశలు తీరతాయా? లేక అడియాసలేనా అన్నది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?