టీటీడీ జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వ ప్రయత్నం సఫలమయ్యేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి?
సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి కూడా కావాలని పట్టుబట్టి దక్కించుకుంటున్నారు. ఈ ఒత్తిళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి. గతంలో 18 మంది సభ్యులుంటే.. బోర్డులో చోటు ఆశిస్తున్నవారి సంఖ్య అంతకు రెట్టింపు ఉండటంతో చట్ట సవరణ చేసి.. 25కు పెంచారు. నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు.. 8 మంది ప్రత్యేక ఆహ్వానితులతో అది 37కు చేరుకుంది. ఈసారి ఏకంగా 81 మందితో జంబో పాలకమండలిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రెండు జీవోలను సస్పెండ్ చేసిన హైకోర్టు..!
1987 దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో పాలకమండలి సభ్యుల సంఖ్య 29కి మించకూడదు. ఆరుగురితో మొదలైన పాలకమండలి ఇప్పుడు 29కి చేరింది. ఇక ఇతర సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రంలోని పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతుల సిఫారసులతో అది 81కి చేరింది. 25 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్లు ఆహ్వానితులు కాగా.. మరో 51 మందిని ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో జీవోలు వచ్చాయి. ఈ చర్యను టీడీపీ, బీజేపీ నాయకులు కోర్టులో సవాల్ చేయడంతో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన రెండు జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఆర్డినెన్స్ తెస్తారా?
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. చట్ట సవరణ చేసి ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని చేర్చబోతున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. నవంబర్లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో చట్ట సవరణ చేస్తారని సమాచారం. ఆ విధంగా సమస్యను పరిష్కరించే యోచనలో పెద్దలు ఉన్నారట. అయితే ఆర్డినెన్స్ జారీ చేసినా.. తిరిగి కోర్టు తలుపులు తడతామంటున్నారు పిటిషనర్లు. అందుకే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మరి.. ఆహ్వానితుల జాబితాలో ఉన్నవారి ఆశలు తీరతాయా? లేక అడియాసలేనా అన్నది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!