తెలంగాణ బీజేపీలో వలస నేతల ఢిల్లీ టూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’!
Also Read
తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు. ఇటీవల ఆ చేరికలు నెమ్మదించాయి. కానీ.. వలస వచ్చిన నేతలు.. గుడ్బై చెబుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీకి రాంరాం చెప్పారు. ఇలా ఒక్కొక్కరుగా కాషాయ శిబిరం నుంచి చేజారిపోతుండటంతో కమలనాథులు అలర్ట్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లేవారివల్ల పార్టీకి నష్టమా.. లాభమా అనేది పక్కన పెడితే.. జరుగుతున్న పరిణామాలు రాంగ్ సిగ్నల్ పంపుతాయని నాయకులు కలవరం చెందారట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకున్న చర్యలే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
ప్రచారంలో ఉన్నవారితో బండి సంజయ్ అండ్ టీమ్ మాట్లాడిందా?
బీజేపీలోని వలస నాయకులపై టీఆర్ఎస్, కాంగ్రెస్ గురిపెట్టాయి. కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వారు వెళ్తారో లేదో కానీ.. బండి సంజయ్ అంట్ టీమ్ గత రెండేళ్లుగా పార్టీలో చేరిన వారితో మాట్లాడటం మొదలుపెట్టింది. ముఖ్యంగా యువనేత వీరేంద్రగౌడ్ ఇంటికి రేవంత్, మధుయాష్కీలు వెళ్లి మాట్లాడిన తర్వాత.. బీజేపీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు వేగంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. రేవంత్తో భేటీ తర్వాత వీరేంద్రగౌడ్.. నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసివచ్చారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. ఆ విధంగా తాను పార్టీ మారడం లేదన్న సంకేతాలు పంపించారు వీరేంద్రగౌడ్.
వలస నేతలను తీసుకుని ఢిల్లీ వెళ్తున్న కమలనాథులు
ఎవరిపేర్లు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయో.. వారిని తీసుకుని బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టారు. పెద్దిరెడ్డితోపాటు పార్టీని వీడతారని అనుకున్న మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, శేరిలింగంపల్లి నాయకుడు రవియాదవ్లు కూడా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. బీజేపీ ఎంపీ ఒకరు వారిని హస్తినలో పార్టీ పెద్దలతో మాట్లాడించారు. మాజీ మంత్రి ముఖేష్గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఢిల్లీ తీసుకెళ్లారు. పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడం ఒక అంశమైతే.. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిస్తే.. వలస నేతలు ధైర్యంగా ఉంటారనే లెక్కలు ఈ టూర్ల వెనక ఉన్నాయట. ఒట్టు వేయించుకోవడం.. ప్రమాణాలు చేయించుకోవడం తప్ప నమ్మకం కుదిర్చేలా చేతులు కలిపి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారట.
బీజేపీలో ఒక్కసారిగా వలస నేతలకు గుర్తింపు!
మొత్తానికి బీజేపీ నుంచి కొందరు వెళ్లిపోవడం వల్ల.. పార్టీలో ఎలాంటి పదవులు లేక.. గుర్తింపు లభించక ఉస్సూరుమంటున్న వలస నేతలపై ఒక్కసారిగా కమలనాథులు ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మారుతున్నారని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడానికి ఢిల్లీ వెళ్లారా లేక తమ అసంతృప్తిని తెలపడానికి ఈ టూర్ను ఉపయోగించుకున్నారా అన్నది ప్రశ్నగానే ఉందట.
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..