మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్..నలిగిపోతున్న క్యాడర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి.. ఓడింది రెండుసార్లు. పార్టీ అవకాశం ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది. ఈసారి కష్టమని భావించారో ఏమో ఇంకో నియోజకవర్గంపై కర్చీఫ్ వేయాలని చూస్తున్నారట. దీంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందా లేక.. షాక్ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన?
మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్!
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
విశాఖ జిల్లా మాడుగుల. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు ఆపార్టీ అభ్యర్ధులే గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి కరణం ధర్మశ్రీ గెలవడంతో టీడీపీ హవాకు బ్రేకులు పడ్డాయి. బలమైన కేడర్ ఉండటంతో 2009 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ పుంజుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు గవిరెడ్డి రామానాయుడు. వైసీపీ వచ్చాక మాడుగుల రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. లీడర్లు, కేడర్ ఫ్యాన్ గూటికి చేరడంతో టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పలేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. నాయకత్వ లోపంతో టీడీపీ డీలా పడింది. పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి.
మూడు ముక్కలాటలో నలిగిపోతున్న కేడర్!
పార్టీలో వర్గపోరు మాడుగుల టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న గవిరెడ్డి కాళ్ల కిందకు నీళ్లు తెచ్చాయట. ప్రస్తుతం ఓ వర్గానికి గవిరెడ్డి.. మరోవర్గానికి పైలా ప్రసాద్.. ఇంకో వర్గానికి పీవీజీ కుమార్ నాయకత్వం వహిస్తున్నారట. పైలా ప్రసాద్.. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. పీవీజీ కుమార్ ఇటీవలే వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు. టీడీపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపిస్తే ముగ్గురు నేతలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒకరి దగ్గరకు వెళ్తే మరొకరు తమను పట్టించుకోక కేడర్లో నిరుత్సాహం నెలకొందట. ఈ మూడు ముక్కలాటలో నలిగిపోవడంకంటే కామ్గా ఉండటం మంచిదనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారట.
అభద్రతా భావంలో రామానాయుడు?
మాడుగులలో టీడీపీకి ఈ పరిస్ధితి రావడానికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఎదుర్కొంటున్న అభద్రతా భావమే కారణమట. త్వరలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు చేయనుంది. గెలుస్తారు అని అనుకున్నవాళ్లనే ఇంఛార్జ్లుగా చేస్తారని టాక్. అదే జరిగితే మాడుగుల టీడీపీకి కొత్త నాయకత్వం వస్తుందనే ప్రచారం గట్టిగా ఉంది. ఇంఛార్జ్ పదవిని కాపాడుకోవడానికి గవిరెడ్డి.. కొత్తగా పగ్గాలు చేపట్టడానికి పైలా ప్రసాద్లు పోటీ పడుతున్నారట. అయితే పీవీజీ కుమార్ పేరును పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన ఉంది. చివరకు రేస్లో ప్రసాద్, కుమార్లే ఉంటారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు.
గవిరెడ్డికి క్లాస్ తీసుకున్న అచ్చెన్న!
మాడుగులలో పెత్తనం కోసం చూస్తోన్న ముగ్గురు నేతలు స్థానికంగా ఉండటం లేదు. వైజాగ్ నుంచి రాజకీయాలు చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు ఉంటేనే మాడుగుల వెళ్తున్నారట. తాజా పరిణామాలను గమనించిన తర్వాత ఇంఛార్జ్ పదవితోపాటు, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా పోతుందనే భయం రామానాయుడిని వెంటాడుతోందట. ఇటీవలే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నను కలిసి.. తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరారట రామానాయుడు. మాడుగుల పరిణామాలను ఏకరవు పెట్టేందుకు కొంతమంది సన్నిహితులు, ముఖ్య నాయకులను వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామానాయుడికి అచ్చెన్న ప్రైవేట్గా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మాడుగులలో టీడీపీ ప్రస్తుత పరిస్థితికి రామానాయుడు వైఖరే కారణమని చెప్పినట్టు వినికిడి.
విశాఖ దక్షిణ నియోజకవర్గంపై గవిరెడ్డి కన్నేశారా?
ఈ పరిణామాల తర్వాత రామానాయుడు మరో ఆలోచన చేస్తున్నారట. బంగారం వ్యాపారైన ఆయన ఎక్కువగా వైజాగ్లోనే ఉంటారు. అందుకే తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విశాఖ సిటీ పరిధిలోనే పోటీ చేయడం కరెక్ట్ అని భావించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ ఫిరాయించడంతో ఖాళీ అయిన విశాఖ దక్షిణ నియోజకవర్గం కోసం రామానాయుడు ప్రయత్నిస్తున్నారట. కొందరు పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వదించమని కోరినట్టు టాక్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా సీటుకే ఎసరొచ్చే పరిస్థితి తలెత్తిందట. దీంతో ఇదంతా గవిరెడ్డి స్వయం కృతాపరాధమే అంటోంది మాడుగుల టీడీపీ కేడర్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!