అడ్రస్ మిస్ అవుతుందేమోనని బలప్రదర్శనకు దిగిన వైసీపీ మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రివర్గ విస్తరణలో స్ధానం కోల్పోయిన అనంతరం తొలిసారి ప్రకాశం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అభిమానులు అనూహ్య రీతిలో ఘన స్వాగతం పలికారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకున్న ఉమ్మడి జిల్లా వైసీపీ శ్రేణులు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి ఆయనను జిల్లాకు తీసుకు వచ్చారు.
గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దుల వద్ద పర్చూరు, చీరాల నియోజకవర్గాల వైసీపీ నేతలు.. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అద్దంకి నియోజకవర్గాల వైసీపీ నేతలు.. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద సంతనూతలపాడు, దర్శి, నియోజకవర్గాల వైసీపీ నేతలు.. ఒంగోలు వద్దకు చేరకునే సమయానికి మిగతా అన్నీ నియోజకవర్గాల వైసీపీ నేతలు భారీ వాహనాలతో స్వాగతం పలికారు. ఆయన మంత్రిగా భాద్యతలు స్వీకరించి ఒంగోలు వచ్చే సమయంలో జరిగిన ర్యాలీలకు భిన్నంగా ఈ ర్యాలీ సాగిందట. బాలినేని మంత్రిగా లేకున్నా ఆయన వెన్నంటే మేమున్నాం అన్నట్లుగా వ్యవహారం సాగటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
నిజానికి మంత్రి పదవి కోల్పోయిన అనంతరం బాలినేని ఇప్పట్లో బయట కనిపించరేమో అనుకున్నారట. కానీ, అంచనాలను భిన్నంగా అడుగులు వేశారు బాలినేని. కార్యకర్తలు, జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తోడవ్వటంతో జనసంద్రాన్ని తలపించేలా భారీ ర్యాలీల నడుమ ఆయనను జిల్లాకు వచ్చారు బాలినేని. ఎవరికీ వారే వచ్చారనుకుంటున్నా చివరికిది బల ప్రదర్శన అన్నట్లుగానే మారింది. ఇంతకీ ఆయన జిల్లాలో వైసీపీ శ్రేణుల్లో తనకున్న బలాన్ని చెప్పాలనుకున్నారా.. నేతలే ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటాలనుకున్నారా..అనేది ఇప్పుడు చర్చగా మారింది.
ఈ ర్యాలీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మినహా మిగిలిన మొత్తం ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు హాజరవటం చర్చనీయాంశంగా మారిందట.. మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం నుండి స్పల్ప సంఖ్యలో మాత్రమే హాజరయ్యారట.. ర్యాలీలో మాజీ మంత్రి బాలినేని మాత్రం ఎక్కడా మాట్లాడకుండా కేవలం అభివాదాలకే పరిమితమయ్యారట.
ఒంగోలు లోని తన ఇంటికి వెళ్లిన తర్వాతే బాలినేని మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని.. వెన్నంటే ఉన్న జనంతోనే.. సీఎం జగన్ తోనే.. ఎప్పుడూ తన పయనిమని తేల్చి చెప్పారట.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలను గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారట. అయితే ఏపీలో మంత్రి పదవి కోల్పోయిన కొందరు మాజీలు తమ సొంత వ్యవహారాలకు వెళ్లిపోవటం.. ఇళ్లు.. ఫాం హౌస్ లకు పరిమితం కావటంతో ముందుగా అందరూ బాలినేని కూడా కార్యకర్తలకు కాస్త దూరమవుతారని భావించారట. అయితే అనూహ్యంగా దూకుడుగా జనాల్లోకి వచ్చారు బాలినేని.
ఈ ర్యాలీని చూస్తే, జిల్లా మొత్తం బాలినేని వెంటే ఉందనిపిస్తోందనే కామెంట్స్ వినిపించాయట. దీంతోపాటు మంత్రి సురేష్ ఇంటికి వెళ్లి మరీ బాలినేనిని కలవటంతో, ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని కేడర్ కు సంకేతాలు పంపినట్లు బావిస్తున్నారట. బాలినేని ఈ ర్యాలీ ద్వారా సీఎం జగన్ కు సంఘీబావం ప్రకటించారా.. తన బలాన్ని తెలిపారా..మంత్రిపదవి రాకున్నా, జిల్లాలో తనదే పైచేయి అని చెప్పాలనుకున్నారా అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయితే, ఈనెల 22న ఒంగోలులో సీఎం జగన్ పర్యటన నేపధ్యంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారనే ఆసక్తి కొనసాగుతోంది.
Watch Here : https://youtu.be/IjN91drtuaE
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!