Water Bankruptcy: ముంచుకొస్తున్న భారీ ముప్పు.. ప్రమాదంలో ఇండియా.. UN రిపోర్టులో భయంకర నిజాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది ఒక్క ఏడాది సంభవించిన కరువు కథ కాదు. ఒక్క నగరంలో నీళ్లు ఇంకిపోయిన వార్త కూడా కాదు. భూమి మీద నీరు దివాలా తీస్తోందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా హెచ్చరిస్తున్న క్షణం ఇది. నీరు దివాలా తియ్యడమేంటని ఆలోచిస్తున్నారా? ఈ పదం వినియోగించడానికి ఒక బలమైన కారణముంది.
ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ నివేదిక ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే ‘వాటర్ బ్యాంక్రప్సీ..’! అంటే నీరు దివాలా తియ్యడమని అర్థం. నదులు, భూగర్భ జలాలు, సరస్సులు ఇక మళ్లీ కోలుకునే అవకాశం కూడా లేకుండాపోయిన దశను ఈ పదం గుర్తుచేస్తోంది. ఇటు చెన్నై, బెంగళూరు, ఎన్సీఆర్ లాంటి నగరాలు ఇప్పటికే ‘డే జీరో’ పరిస్థితిని చూశాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి. ట్యాంకర్ల మీద ఆధారపడే జీవితం. ఇప్పటికే మొదలైన పతనానికి ఇవే సంకేతాలు.
Also Read
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్నది కూడా ఇదే. నీటి సమస్య ఇక భవిష్యత్తు ముప్పు కాదు. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం. ఇది రైతుల సమస్యో, నగరాల సమస్యో కాదు.. ప్రతీ ఒక్కరి సమస్య. ఇంతకీ ఈ వాటర్ బ్యాంక్రప్సీ అంటే ఏంటి? భారత్ ఈ స్థితికి ఎలా చేరింది?
ఇండియా ఈ స్థితికి ఎలా చేరిందన్న ప్రశ్నకు చాలా సమాధానలున్నాయి. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ విడుదల చేసిన గ్లోబల్ వాటర్ బ్యాంక్రప్సీ రిపోర్ట్ 2026 ఒక స్పష్టమైన నిజాన్ని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఉపయోగిస్తున్న నీటి పరిమాణం, ప్రకృతి మళ్లీ తయారు చేసే నీటికన్నా చాలా ఎక్కువగా మారిపోయింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో ఈ తేడా మరింత ప్రమాదకరంగా పెరుగుతోంది. భారత్ దీనికి మినహాయింపేమీ కాదు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉపయోగిస్తున్న ఫ్రెష్ వాటర్లో 70 శాతం పైగా వ్యవసాయ రంగానికే వెళ్తోంది. ఇది భారత పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. దేశంలో నదుల నీరు, కాలువలు మాత్రమే కాదు.. భూగర్భ జలాల మీదే వ్యవసాయం ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ అదే భూగర్భ జలాలు ఇప్పుడు వేగంగా ఖాళీ అవుతున్నాయి. భూగర్భ జలాల్లో మాయమయ్యే నీరు.. మళ్లీ త్వరగా నిండదు. వర్షం కురిసినా కూడా ఆ గ్యాప్ పూడ్చలేని పరిస్థితి రావొచ్చు.
ఇప్పటికే నగరాలు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాయి. చెన్నైలో కొన్ని సంవత్సరాల క్రితం తాగునీటి నిల్వలు పూర్తిగా ఎండిపోయాయి. బెంగళూరులో వేలాది బోర్వెల్స్ పని చేయకుండా పోయాయి. NCR ప్రాంతంలో కొత్త కాలనీలు ట్యాంకర్ నీటిపైనే బతుకుతున్నాయి. నివేదిక ఈ పరిస్థితిని డే జీరోగా నిర్వచిస్తోంది. అంటే మౌలిక వసతులు ఉన్నా.. నీరు లేని అత్యవసర దశ అని అర్థం. ఇక ఈ నీటి దివాలా ప్రభావం కేవలం తాగునీటితోనే ఆగదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం నీటి కొరత ఆహార భద్రతను దెబ్బతీస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడే కోట్లాది కుటుంబాల ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగాలు తగ్గుతాయి. ఆహార ధరలు పెరుగుతాయి. గ్రామాల నుంచి నగరాల వైపు వలసలు పెరుగుతాయి. ఇది ఒక చైన్ రియాక్షన్.
ఇంకో భయానక అంశం కూడా ఉంది. గత ఐదు దశాబ్దాల్లో ప్రపంచం సుమారు 41 కోట్ల హెక్టార్ల వెట్ల్యాండ్స్ను కోల్పోయింది. ఇది యూరోపియన్ యూనియన్ పరిమాణంతో సమానం. వెట్ల్యాండ్స్ అంటే నీటిని నిల్వ చేసే సహజ బ్యాంకులు. అంటే వర్షపు నీటిని, నదుల నుంచి వచ్చే నీటిని కొంతకాలం నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు మెల్లగా విడుదల చేసే సహజ ప్రాంతాలు. అవి నశిస్తే, వరదలు ఎక్కువ అవుతాయి. కరువులు తీవ్రమవుతాయి. అదే సమయంలో వాతావరణ మార్పు వల్ల గ్లేషియర్లు కరుగుతున్నాయి. 1970 తర్వాత ప్రపంచ గ్లేషియర్ మాస్లో 30 శాతం పైగా నష్టం జరిగింది. ఇది భారత్ లాంటి దేశాలకు మరో పెద్ద ముప్పు. ఎందుకంటే హిమాలయాల నుంచి వచ్చే నీటిపై కోట్ల మంది ఆధారపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ట్యాంకర్లు, లోతైన బోర్వెల్స్తో పాటు నదుల నీటిని మరో చోటికి మళ్లించడం లాంటి తాత్కాలిక పరిష్కారాలు ఇక సరిపోవని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్ లాంటి దేశాలు నిర్మాణాత్మక మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేస్తోంది. భూగర్భ జలాలపై నియంత్రణ, ఎక్కువ నీరు తాగే పంటల నుంచి మార్పు, నీటి సామర్థ్యానికి అనుగుణంగా పట్టణ ప్రణాళికలు చేయడం లాంటివి ఇకపై తప్పనిసరి అంటోంది. ఇక ఐక్యరాజ్యసమితి హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, భారత్ తరచూ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభాల నుంచి శాశ్వత నీటి దివాలా స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తు కథ కాదు. మన కళ్ల ముందే జరుగుతున్న వాస్తవం.
నీరు లేకుండా పరీక్షలు రాసే విద్యార్థులు, పంటలు లేకుండా జీవించే రైతులు, ట్యాంకర్ల కోసం ఎదురుచూసే నగరాలు..ఇవే వాటర్ బ్యాంక్రప్సీకి తొలి సంకేతాలు.
ALSO READ: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!