Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Nuclear Tests Killed 4 Million Shocking Report On Radiation Global Toll 1945 2017

Nuke Testings: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?

Published Date :January 25, 2026 , 11:17 am
By Trinath Bandaru
Nuke Testings: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణం నుంచి మానవ చరిత్ర ఒక కొత్త గాయాన్ని మోసుకుంటూ వస్తోంది. యుద్ధాలు ముగిశాయి. ఒప్పందాలు కుదిరాయి. కానీ అణు పరీక్షలు వదిలిన విషం మాత్రం ఆగలేదు.

ఇప్పుడు బయటకు విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. 1945 నుంచి 2017 వరకు జరిగిన అణు పరీక్షల ప్రభావంతో కనీసం 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక చెబుతోంది. ఇవి యుద్ధంలో చనిపోయిన సంఖ్యలు కావు. కనిపించని రేడియేషన్ వల్ల నెమ్మదిగా చనిపోయిన జీవితాలు. నిజానికి అణు పరీక్షలు కొన్ని దేశాల భూభాగాల్లో మాత్రమే జరిగాయి. కానీ వాటి ప్రభావం ఒక్క దేశానికి పరిమితం కాలేదు. ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషి శరీరంలో ఆ పరీక్షల జాడలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. ఇంతకీ ఈ అణు పరీక్షలు ప్రపంచాన్ని ఎలా విషపూరితం చేశాయి? ఎవరు ఎక్కువగా ఈ మూల్యం చెల్లించారు? ఎందుకు ఇప్పటికీ ఈ గాయాలపై మౌనం కొనసాగుతోంది?

Also Read

  • Peddi : పెద్ది ఎడిటింగ్'లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
  • Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
Add as a preferred
source on google

ఇప్పటివరకు అణు ఆయుధాలు అంటే యుద్ధంలో ఉపయోగించిన రెండు బాంబుల గురించే అందరూ మాట్లాడుకునేవాళ్లు. కానీ నిజమైన విధ్వంసం యుద్ధంలో కాదు. శాంతి పేరుతో చేసిన పరీక్షల్లో జరిగింది.

1945 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 2,400కి పైగా అణు పరికరాలు పేల్చారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా నుంచి భారత్, పాకిస్తాన్ వరకు అణుశక్తి ఉన్న దేశాలన్నీ ఈ పరీక్షల్లో భాగమే. ఈ పేలుళ్లలో ఎక్కువ భాగం భూవాతావరణంలోనే జరిగాయి. ఆకాశంలోకి వెళ్లిన రేడియేషన్ గాలితో కలిసి ఖండాలు దాటింది. సముద్రాల్లో కలిసింది. భూమిలోకి చొచ్చుకెళ్లింది. చివరకు మన ఆహారంలోకీ వచ్చింది. నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే మానవతా సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడుతోంది.

అణు పరీక్షల వల్ల విడుదలైన అయానైజింగ్ రేడియేషన్ మన DNAను నేరుగా దెబ్బతీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ఫలితమే క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లు, పుట్టుక లోపాలు. వాతావరణంలో జరిగిన అణు పరీక్షల కారణంగా మాత్రమే భవిష్యత్తులో 20 లక్షల క్యాన్సర్ మరణాలు, మరో 20 లక్షల గుండె సంబంధిత మరణాలు సంభవించే అవకాశముందని నివేదిక హెచ్చరిస్తోంది.

రేడియేషన్‌కు సురక్షితమైన స్థాయి అనే మాటే లేదని సైన్స్ స్పష్టంగా చెబుతోంది. తక్కువ మోతాదులోనైనా ప్రభావం తప్పదన్నది నిపుణుల అభిప్రాయం కూడా.మరోవైపు అణు పరీక్షలు జరిగిన ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రజలే ఎక్కువగా మూల్యం చెల్లించారు. ఫ్రెంచ్ పోలినీషియా, మార్షల్ దీవులు, కజకస్తాన్, అల్జీరియా లాంటి ప్రాంతాల్లో నివసించిన ప్రజలు తరతరాలుగా అనారోగ్యాలతో జీవిస్తున్నారు. పిల్లలు పుట్టేలోపే శరీర లోపాలతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు రేడియేషన్ వల్ల కలిగే క్యాన్సర్లకు పురుషులకంటే 52 శాతం ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. గర్భంలో ఉన్న శిశువులు, చిన్న పిల్లలు ఈ విషానికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు.

ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈ పరీక్షలపై ఇప్పటికీ పూర్తి నిజం బయటకు రాలేదు. అనేక దేశాలు డేటాను గోప్యంగా ఉంచాయి. ఎక్కడ ఎంత రేడియేషన్ పాతిపెట్టారో, ఏ ప్రాంతాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయో చెప్పడం లేదు.

బాధితులకు సరైన వైద్యం లేదు. స్క్రీనింగ్ లేదు. నష్టపరిహారం పేరుతో చేసిన పథకాలు కూడా బాధితులను ఆదుకునేలా కాకుండా ప్రభుత్వాల బాధ్యతను తగ్గించేలా ఉన్నాయని నివేదిక ఆరోపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క అణుశక్తి దేశం కూడా ఈ పరీక్షల కోసం బహిరంగంగా క్షమాపణ చెప్పలేదు. నిజానికి అణు పరీక్షలను దేశ భద్రత పేరుతో జరుపుతుంటారు కానీ ఈ నివేదిక చెబుతున్న కథ వేరే. ఇది భద్రత కాదు. ఇది నెమ్మదిగా సాగిన మానవ హత్య. యుద్ధం లేకుండానే కోట్ల మంది ప్రాణాలు తీసిన విధ్వంసం. అణు బాంబు పేలుడు ఒక క్షణం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం తరతరాలుగా కొనసాగుతుంది.

ప్రపంచం ఇప్పుడు మరోసారి అణు పరీక్షల మాట మాట్లాడుతున్న సమయంలో ఈ నివేదిక ఒక హెచ్చరిక. గతం మిగిల్చిన విషం ఇంకా మన శరీరాల్లో ఉంది. దాన్ని మరిచి మళ్లీ అదే దారి ఎంచుకుంటే, రానున్న తరాలు మరింత మూల్యం చెల్లించాల్సి రావడం ఖాయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • atomic bomb
  • Global Nuclear Impact
  • Nuclear Testing Deaths

తాజావార్తలు

  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

  • IPL 2026-BCCI: ఐపీఎల్‌లో సంచలనం.. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు.. సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్!

  • Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్‌లు ఇవే!

  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions