Theatre Crisis: అసలు థియేటర్లో రెంట్, పర్సంటేజ్ బేసిస్ అంటే ఏంటి?
టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు అందరూ కలిసి, తమకు ప్రతి సినిమా పర్సంటేజ్ పద్ధతిలోనే కావాలని డిమాండ్ తెరమీదకు తెచ్చారు.
Also Read:Jailer 2 : జైలర్-2లో ఆ కాంట్రవర్సీ యాక్టర్..?
Also Read
- Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
- Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
- Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
- 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!
అయితే, రెంటల్ పద్ధతి ఏంటి, పర్సంటేజ్ పద్ధతి ఏంటి అనేది చాలామందికి అవగాహన లేదు. రెంటల్ పద్ధతి విషయానికి వస్తే, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ కేవలం వేరే వారి సినిమాకు తన సొంత థియేటర్ను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అయితే పెళ్లి జరుపుకునేందుకు ఒక పెళ్లి మండపాన్ని అద్దెకు ఇస్తారో, అలా థియేటర్ను అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. అదే పర్సంటేజ్ పద్ధతి విషయానికి వస్తే, సినిమా టికెట్ల అమ్మకం జరిగిన తర్వాత ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో లెక్కలు తీసి, అందులో కొంత పర్సంటేజ్ ఎగ్జిబిటర్కు, మరికొంత డిస్ట్రిబ్యూటర్ ద్వారా నిర్మాతకు చేరేలా అగ్రిమెంట్లు రాసుకుంటారు.
Also Read:Andhra King Taluka: ఆంధ్రా కింగ్ బరిలోకి దిగాడు!
ఇప్పటివరకు జరుగుతున్న పద్ధతి ఏంటంటే, పెద్ద సినిమాలన్నీ రెంటల్ పద్ధతిలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు తాము నష్టపోతున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు వాపోతున్నారు. ఎందుకంటే, చిన్న సినిమాలను పర్సంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తున్నప్పటికీ అవి తమకు ఇబ్బందిగానే ఉన్నాయని, అదే పెద్ద సినిమాలను రెంటల్ పద్ధతిలో కాకుండా పర్సంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తే తాము కూడా కొంత లాభం పొందవచ్చని వారు చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం రిస్క్ అని కొందరు పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు.
నిజానికి రెండు పద్ధతుల్లోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు ఇకపై పర్సంటేజ్ విధానమే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పట్టుదలకు కారణం కొందరు నిర్మాతలపై ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం రూపొందుతోంది. ఈ ప్రచారం ఇప్పుడు పెద్దదై, ఏకంగా ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించే స్థాయికి చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ అంటూ సినీ పరిశ్రమపై ఫైర్ అయిన పరిస్థితి తలెత్తింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!